భారీ జరిమానాలతో మందుబాబుల బెంబేలు: ప్రత్యేక కోర్టుల సంచలన తీర్పు!
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదింపజేసిన కొత్త మోటారు వాహనాల సవరణ చట్టం2019ను తెలంగాణలో అమలు చేయమని, అంత భారీ మొత్తంలో జరిమానాలను వసూలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు కొంత ఊపిరిపీల్చుకున్నారు.

భారీ జరిమానాలు
అయితే, ఈ కొత్త వాహనాల చట్టంను హైదరాబాద్ ప్రత్యేక కోర్టులు అమలు చేయడం ప్రారంభించాయి. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన 9 మంది వాహన చోదకులకు రూ. 10,500 చొప్పున జరిమానా విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశాయి.

కొత్త వాహనాల చట్టం ప్రకారమే..
వారాంతాల్లో పట్టుబడిన మందుబాబులను ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. దీంతో మందుబాబులకు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలను ప్రత్యేక కోర్టుల న్యాయమూర్తులు విధించారు. మోటారు వాహనాల సవరణ చట్టంలోని నిబంధనలను పరిశీలించి ఎంవీ చట్టం 185(ఎ) ప్రకారం కొత్త జరిమానాలను విధించాలని న్యాయూర్తులు నిర్ణయించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మందుబాబులకు జరిమానాతోపాటు జైలు శిక్ష విధించే అధికారం కోర్టులకు ఉండటంతో కొత్త జరిమానాలను విధించవచ్చు.

గత నెల నుంచే..
కాగా, సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటారు వాహనాల సవరణ చట్టం దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రాలు ఈ సవరణ చట్టం ప్రకారం జరిమానాలు విధించవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. దీంతో పలు రాష్ట్రాలు పాత జరిమానాలనే కొనసాగిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం కొత్త వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు జరిమానాలను కొత్త చట్టం ప్రకారం ఉన్న జరిమానాలను కొంత తగ్గించి విధిస్తున్నాయి. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తమ రాష్ట్రాల్లో కొత్త చట్టం ప్రకారం జరిమానాలను విధించమని ప్రకటించాయి.

నిబంధనలు.. ఛార్జీలు
కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై రూ. 500-10,000 వరకు జరిమానా, ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం కూడా ఉంది. అంతేగాక, ద్విచక్ర వాహనంపై వెళ్లే నాలుగేళ్లలోపు పిల్లలూ హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే రూ. 1000 జరిమినా విధిస్తారు. నిర్ణీత వేగం కంటే ఎక్కువ వేగంతో వెళితే.. రూ.1000-2,000 వరుక జరిమానా విధించడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితితిలో ప్రయాణించే వాహనాలు అంబులెన్స్, ఫైరింజిన్లకు దారి ఇవ్వకపోతే రూ. 10వేలు జరిమానా విధిస్తారు. అనర్హత వేటుపడిన డ్రైవర్ వాహనం నడిపితే రూ. 10వేలు జరిమానా విధిస్తారు.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications