తెలంగాణ ఎమ్మెల్యేలకు కొత్త భవనాలు... జూన్ 17న ప్రారంభం
తెలంగాణ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కొత్త భవనాలు కేటాయించనున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా హైదర్గూడాలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణలో నిర్మిస్తున్న నయా.. క్వార్టర్స్కు జూన్ 17న ప్రారంభోత్సవం చేయనున్నారు. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిలు కలిసి జూన్17 ఉదయం 6గంటలకు న్యూ క్వార్టర్స్ను ప్రారంభించనున్నారు.
బిష్కేక్ సమావేశానికి మోడీ... పాక్ గగనతలం గుండా ప్రయాణించని ప్రధాని...!
కాగా హైదర్గూడలో నిర్మిస్తున్న క్వార్టర్స్ను మొత్తం 4.5 ఎకరాల స్థలంలో రూ.166 కోట్లతో 120 క్వార్టర్లను నిర్మించారు. ప్రతి ప్లాట్ 2100 చ.అ విస్తిర్ణంతో త్రిబుల్ బెడ్ రూం ప్లాట్స్ను అధునూతన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్తోపాటు అందులో పని చేసే సిబ్బంది క్వార్టర్స్ను కూడ మరో 36 ప్లాట్లను నిర్మించారు.
Recommended Video
మరోవైపు క్వార్టర్స్లో గ్రౌండ్ ప్లోర్తో పాటు, సందర్శకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక హళ్లు బ్యాంకు, క్లబ్ హౌజ్ ,సూపర్ మార్కెట్ లాంటీ నిత్యవసరాల కోసం కూడ గదులు ఏర్పాటు చేశారు.కాగా ఎమ్మెల్యేల కోసం అంతకు ముందు నిర్మించిన భవనాలతోపాటు ఆదర్శ్ నగర్లో నిర్మించిన భవనాలు కూడ అందుబాటులో ఉన్నాయి.