ఉగ్రవాదుల ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు, స్వాధీనం
దేశంలో ఎక్కడ ఉగ్ర దాడి జరిగిన హైదరాబాద్తో లింక్ ఉంటుంది. బీహర్ దర్బంగా రైల్వేస్టేషన్ బాంబు ఘటన ఉలికిపాటుకు గురిచేసింది. అయితే హైదరాబాద్లో ములాలు కనిపించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులను అరెస్ట్ కూడా చేసింది. అయితే నగరంలో గల ఉగ్రవాదుల ఉన్న ఇంట్లో భారీగా పేలుడు సామగ్రిని ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఐఈడీ తయారీలో ఉపయోగించేపేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నాసిర్ మాలిక్ ఇంట్లో ఎన్ఐఏ నిన్న సోదాలు నిర్వహించింది.
బీహార్లోని దర్భంగా రైల్వేస్టేషన్లో బాంబు దాడి జరిగిన సంగతి విదితమే. ఈ ఘటనకు హైదరాబాద్కు లింకు ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించి కేసు నమోదు చేసింది. నిందితులను అరెస్టు చేసి విచారించగా... ఐఎస్ఐ ఉగ్రదాడికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తేలింది. జూన్ 17 జరిగిన ఘటనపై దర్యాప్తు జరిపిన ఎన్ఐఎ తీగలాగితే...డొంక కదిలింది.

హైదరాబాద్ మల్లేపల్లిలో ఉంటున్న ఇద్దరు లష్కర్ తోయిబాకు చెందిన ఇమ్రాన్ మాలిక్, సోదరుడు మహ్మద్ నాజిర్ మాలిక్ను అరెస్టు చేసింది. వీరిద్దరి స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని షామిలి జిల్లాలోని కైరానా అని గుర్తించారు. మల్లేపల్లిలో ఉంటున్న వారి నివాసం నుండి సోదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి నివాసం నుండి పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. గతంలో మరో ఇద్దరు హీజ సలీమ్, కఫీల్ను యాపి యాంటీ టెర్రరిజమ్ స్వ్కాడ్ అధికారులు అదుపులోకి తీసుకుని ఎన్ఐఎకు అప్పగించారు.
నాజిర్ మాలిక్ హైదరాబాద్లో 20 ఏళ్ల నుండి ఓ బట్టల దుకాణం నడుతుండగా.. గతంలో పాకిస్తాన్ వెళ్లి పేలుడు పదార్ధాలను తయారీ చేయడంలో ట్రైనింగ్ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది సోదరుడు ఇమ్రాన్తో కలిసి మల్లేపల్లిలో ఉంటున్నారు. దేశ వ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు తేలింది. భారీ ప్రాణ, ఆస్తి నష్టాలకు కలిగించేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది. పాక్ ముష్కర సంస్థ లష్కరే తోయిబా ఆదేశాల ప్రకారం వీరు ఐఇడి బాంబును వారి బట్టలతో కలిపి ఉంచి పార్సిల్ చేశారు. దీనిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి దర్బాంగాకు తరలించారు. అది కనుక రైలులో పేలి ఉంటే పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం వాటిల్లేదని అధికారులు తెలిపారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications