పాస్టర్ ప్రవీణ్ అక్రమ గని.. బానిసలుగా మైనర్లు, రూ.కోట్లు దండుకొని.. సోషల్ మీడియాలో పోస్టులు
పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి లీలలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. దేవతల విగ్రహాల ధ్వంసం చేయడంతో ప్రవీణ్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. అయితే అక్రమార్జన కోసం దేశ ప్రతిష్ఠను బజారు కీడ్చాడని లీగల్ రైట్స్ ఫోరం హైదరాబాద్ శాఖ ఇటీవల జాతీయ బాలల హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసింది. బానిసత్వం నుంచి బాలలకు విముక్తి కల్పన పేరుతో దేశానికి అపఖ్యాతి తెచ్చేలా వ్యవహరించారని ఫోరం ప్రతినిధులు వివరించారు.

ఐదేళ్లలో రూ.93.67 కోట్లు
కాకినాడ రూరల్ మండలంలో బాలబాలికల కోసం ప్రవీణ్ చక్రవర్తి సైలోమ్ బ్లైండ్ సెంటర్ సొసైటీ పేరుతో అనాథ శరణాలయం నడిపిస్తున్నాడు. బ్యూషన్ లైసెన్స్ కలిగిన సెంటర్కు 2013-18 వరకు అమెరికాలో ఉన్న సెట్ ఫ్రీ అలయన్స్, వాటర్ ఆఫ్ లైఫ్ అనే సంస్థల నుంచి నగదు అందాయి. గత ఐదేళ్లలో రూ. 93.67 కోట్ల ఫండ్స్ వచ్చాయి. ఇంత పెద్దమొత్తంలో డబ్బు పంపడం వెనక మత మార్పిళ్లే ప్రధాన ఉద్దేశంగా తేలింది. భారత్లో ఏ ఏడాది ఎంతమందిని మతం మార్చాడో వివరిస్తూ వాటర్ ఆఫ్ లైఫ్ సంస్థ తన వెబ్సైట్లో డేటా కూడా పెట్టింది.

బానిసలుగా మైనర్లు
దీనిపై ఫోరం 2019 డిసెంబరు 5న కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. విదేశీ నిధుల కోసం భారత్ పరువును ప్రవీణ్ రోడ్డుకీడ్చాడని ఆరోపించింది. తప్పుడు గణాంకాలను అమెరికన్ క్రైస్తవ సంస్థలకు అందించారని.. ప్రపంచంలో భారత్లో అత్యధిక బానిసలున్నారని పేర్కొన్నారు. వీరిలో 7-14 ఏళ్ల మైనర్ బాలలు ఉన్నారనే దుష్ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. ఎక్కడి నుంచో చిన్న పిల్లలను తీసుకువచ్చి, కృత్రిమ వీడియోలతో వారిని బానిస బాల కార్మికులుగా విదేశీ క్రైస్తవ సంస్థల అధిపతులకు చూపించి ప్రవీణ్ నిధులు రాబట్టడం ప్రారంభించారు.

41765 మంది బానిసలు
బానిసలుగా ఉన్న బాలికలు లైంగిక దాడులకు గురైనట్టు కట్టు కథలు సృష్టించేవాడని తెలిసింది. ఇలా ప్రవీణ్ అక్రమ మార్గంలో కోట్లు సంపాదించారు. ఇప్పటి వరకు 41,765 మంది బానిసలుగా పనిచేస్తున్న బాలకార్మికులను విముక్తి చేసి, వారిని పునరావాసం కల్పించినట్టు సెట్ ఫ్రీ అలయన్స్ సంస్థ అధికారిక సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తోందని గుర్తించారు. పోలీస్, రెవెన్యూతో సంబంధం లేకుండా చట్ట ప్రకారం దేశంలో ఏదైనా స్వచ్ఛంద సంస్థకు, వ్యక్తులకు బాల కార్మికులు కనిపిస్తే పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలి. అలాకాక అతని వద్ద వేలాదిమంది బాలలను బందీగా చేసుకునే అధికారం ఎవరిచ్చారో నిగ్గుతేల్చాలని ఫోరం కోరింది.
Recommended Video

సోషల్ మీడియాలో పోస్టులు
లాక్డౌన్ సమయంలో తన వసతి గృహాల్లో 1500 మంది బాలబాలికలున్నారని, వారిలో 318 మందికి కరోనా సోకిందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ ప్రవీణ్ చందాలు వసూలు చేశాడు. ఈ మేరకు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జాతీయ బాలల హక్కుల కమిషన్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ప్రవీణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications