హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం: పెద్దమొత్తంలో ఆస్తి నష్టం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని పెయింట్‌, రసాయన పరిశ్రమల్లో శనివారం మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి.

ముందుగా పెయింట్‌ పరిశ్రమలో మంటలు వచ్చాయి. వాటిని అదుపులోకి తీసుకురాలేకపోవడంతో పక్కనే ఉన్న రసాయన పరిశ్రమలోకి మంటలు వ్యాపించాయి. దీంతో రసాయనాలతో కూడిన డ్రమ్ములకు మంటలు అంటుకున్నాయి. మంటలు రసాయన పరిశ్రమ అంతటికి వ్యాపించడంతో యంత్రాలు కూడా దగ్ధమయ్యాయి.

Patancheru: huge fire accident in pashamylaram industrial

మంటలను అదుపులోకి తెచ్చేందుకు సంగారెడ్డి, పటాన్‌చెరు, బీడీఎల్‌, బొల్లారం ప్రాంతాలకు చెందిన అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాయి. భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం జరగడంతో పరిశ్రమల చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. దీంతో ఏం జరుగుతుందోనని స్థానికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ అగ్ని ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో నగరంలోని పలు పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

English summary
Patancheru: huge fire accident in pashamylaram industrial
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X