తెలంగాణలో తగ్గుముఖం: 729 కేసులు.. ఐదుగురు మృతి
కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీలో హెచ్చు తగ్గులు ఉండగా.. తెలంగాణలో మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 729 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. 772 మంది బాధితులు చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా సోకిన ఐదుగురు చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 6,36,049కి పెరిగాయి.
ఇవాళ్టి వరకు 6,22,313 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 9980 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ ఐదుగురు చనిపోగా.. మొత్తం మరణాలు 3756కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,15,515 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.