ఉత్తమ్రెడ్డి ఇంట్లో చోరీ కేసు చేజ్, నిందితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, 16 రాష్ట్రాల్లో..
కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బిరామిరెడ్డి అన్న కుమారుడు ఉత్తమ్ రెడ్డి ఇంట్లో చోరీ కేసును పోలీసులు చేధించారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆరిఫ్ దొంగతనం చేశారని పోలీసులు తెలిపారు. నిందితుడిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నామని మీడియాకు వివరించారు. గత నెలలో ఉత్తమ్ నివాసంలో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నెలలోపే ఛేదించారు. అయితే నిందితుడు 16 రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కావడం ఆందోళన కలిగిస్తోంది.

కేసు ఛేదన
గత నెలలో హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఉత్తమ్ రెడ్డి నివాసంలో చోరీ జరిగింది. రూ.2 కోట్ల విలువగల బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. స్థానిక పోలీసులకు ఉత్తమ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేశారు. ఇన్వెస్టిగేషన్లో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆరిఫ్ దొంగతనం చేసినట్టు తేలింది.

కళ్లు గప్పి
ఉత్తమ్ రెడ్డి ఇంట్లో పకడ్బందీ భద్రత ఉంటుంది. అదీ కూడా బంగారు ఆభరణాల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు 12 మంది సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశారు. కానీ వారి కళ్లు గప్పి మరీ చోరీ చేశాడు. దీనినిబట్టి అతను ఎంత క్రిమినలో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రణాళిక ప్రకారం చోరీ చేశారు. తెల్లవారు ఇంటికి తిరిగొచ్చి చూసేవరకు బంగారు నగలు, నగదు లేకపోవడం చూసి చోరీ జరిగిందని భావించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెలుగులోకి వచ్చిందిలా
ఉత్తమ్రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చోరీ చేసిన ఆరిఫ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని గుర్తించారు. అతను ముంబై నుంచి ఆపరేషన్స్ చేస్తుంటాడని పేర్కొన్నారు. ఉత్తమ్రెడ్డి ఇంట్లో చోరీ చేసిన నగదును ముంబై చీకటి మార్కెట్లో విక్రయించినట్టు పోలీసులు తెలిపారు. కేసు గురించి ఆరా తీస్తే.. నిందితుడు బెంగళూరులో పట్టుబడ్డాడని పోలీసులు వివరించారు.

దొంగతనం కలకలం
గత నెలలో బంజారాహిల్స్లో జరిగిన భారీ చోరీ కేసు సంచలనం సృష్టించింది. చోరీ చేసింది ఎవరనే కోణంలో పోలీసులు విచారించారు. తీగలాగితే డొంక కదిలి.. చోరీకి పాల్పడింది ఆరిఫ్ అని గుర్తించారు. హై ఫ్రొపైల్ వారు నివసించే బంజారాహిల్స్లో చోరీ కేసు అప్పట్లో కలకలం రేపింది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నెలరోజుల్లోపు చోరీ చేసింది ఎవరో చేధించారు. నిందితుడు ఆరిఫ్ను అరెస్ట్ చేశారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications