Hyderabad: ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం తీసుకోండి.. పోలీసుల సూచన..
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్ లో కూడా భారీ వాన పడింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కాలనీలు నీట మునిగాయి. ముఖ్యంగా అమీర్ పేట, మైత్రివనం, ఎస్సార్ నగర్, మూసాపేటలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మూసాపేట మెట్రో స్టేషన్ కింద భారీగా వరద నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. దీంతో ద్విచక్ర వాహనాలను దారి మళ్లించి.. భారీ వాహనాలను వరదలొంచే పంపుతున్నారు.
వర్షాలు ఇంకా ఉన్నాయని వాతవరణ శాఖ పేర్కొంది. రేపు కూడా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీతో పాటు పోలీసులులు అలర్ట్ అయ్యారు. ప్రజలకు పలు సూచనలు చేశారు. వర్షం వస్తే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో ఇబ్బందుసు పెరుగుతాయని భావిస్తోంది. మంగళవారం భారీ వర్షంతో చాలా చోట్ల నీరు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు గంటలకొద్ది రోడ్లుపై ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ స్టేట్ పోలీసులు ఓ సూచన చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ప్రజలు ఇంటి నుండి బయటకు రాకూడదు. ఐటి ఉద్యోగులు Work From Home చేసుకోవాలి. అత్యవసర ఉద్యోగులు ఆఫీస్ నుండి ఇంటికి వర్షాభావపరిస్థితిని బట్టి బయలుదేరాలి. pic.twitter.com/s1FD2870nV
— Telangana State Police (@TelanganaCOPs) September 5, 2023
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు బుధవారం కూడా సెలవు ప్రకటించారు. ప్రస్తుతానికి అయితే సిటీలో వర్షం విరామం ఇచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు వరకు పడిన వాన కాస్త తెరుపునిచ్చింది. అయితే ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ పరిధిలో పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరద ప్రభావ ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే వివేకానంద, మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు.












Click it and Unblock the Notifications