Droupadi Murmu: హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు చేరుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ద్రౌపది ముర్ము హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవు, మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎస్ శాంతి కుమారి స్వాగతం పలికారు.
ద్రౌపది ముర్ము హకీంపేట విమానాశ్రయం నుంచి నేరుగా బొల్లారం రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొననున్నారు. 5 రోజుల పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ముర్ము తన పర్యటనలో భాగంగా రెండు యూనివర్సిటీల స్నాతకోత్సవాల్లో పాల్గొంటారు.

ముర్ము మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డు మార్గంలో గచ్చిబౌలి స్టేడియానికి వెళ్తారు. అక్కడ అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ముగింపు ఉత్సవాల్లో పాల్గొననున్నారు. బుధవారం మహారాష్ట్ర పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ద్రౌపది ముర్ము జూన్ 17న దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. శీతాకాలంలో కూడా రాష్ట్రపతి హైదరాబాద్ వస్తారు. బోల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కొద్ది రోజులు ఉండి వెళ్తారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications