రేపిస్టులకు ఎన్ కౌంటర్ కంటే బెత్తం దెబ్బలే బెటర్: ప్రశాంతంగా చావకూడదు: ప్రొఫెసర్ కే నాగేశ్వర్..!
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద వెటర్నరి డాక్టర్ దిశపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన నలుగురు కామాంధులను సైబరాబాద్ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడాన్ని ప్రొఫెసర్ కే నాగేశ్వర్ తప్పు పట్టారు. అత్యాచారానికి పాల్పడిన వారిని ఎన్ కౌంటర్ చేయడం కంటే బెత్తం దెబ్బలు కొట్టాలంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా రేపిస్టులకు బెత్తం దెబ్బలు కొట్టాలని చెప్పారు.

ఎన్ కౌంటర్ పై ప్రొఫెసర్ కే నాగేశ్వర్..
అత్యాచార నిందితులకు ఎన్ కౌంటర్ చేయడంపై తన అభిప్రాయాలను ఆయన వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. వెటర్నరి డాక్టర్ దిశపై అత్యాచారానికి పాల్పడి, అత్యంత పాశవికంగా హతమార్చిన నలుగరు నిందితులు మహమ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులును ఈ నెల 6వ తేదీన సైబరాబాద్ పోలీసులు షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి ఫ్లైఓవర్ కింద ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.

ఎన్ కౌంటర్ పై నిరసనల వెల్లువ..
ఈ ఎన్ కౌంటర్ పై సాధారణ ప్రజల మనోభావాలు ఎలా ఉన్నప్పటికీ.. మేధావులు, వామపక్ష భావజాలం ఉన్న వారూ తీవ్రంగా తప్పు పడుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ ను సీపీఐ, సీపీఎం సైతం వ్యతిరేకించాయి. ఈ ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజావ్యాజ్యం కూడా దాఖలైంది. ఎన్ కౌంటర్ చేయడం వల్ల సైబరాబాద్ పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారని, న్యాయ వ్యవస్థను కించపరిచారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఉరి శిక్ష కన్నా కఠిన శిక్ష అదే..
ఈ ఎన్ కౌంటర్ పై ప్రొఫెసర్ కే నాగేశ్వర్ స్పందించారు. ఎన్ కౌంటర్ చేయడం వల్ల ఉపయోగం ఉండబోదని అన్నారు. అత్యాచార నిందితులు జీవించి ఉండగానే.. కఠినాతి కఠినమైన శిక్షలను విధించాలని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా వారికి బెత్తంతో కొట్టాలని అన్నారు. చర్యం చిట్లిపోయేలాగా రక్తమోడేలాగా బెత్తంతో కొట్టాలని చెప్పారు. ఈ దెబ్బలు వారికి జీవితాంతం గుర్తుండి పోయేలా చేస్తాయని అభిప్రాయపడ్డారు. బెత్తం దెబ్బలు మిగిల్చిన బాధలను అత్యాచార నిందితులు జీవితాంతం బాధిస్తాయని అన్నారు.

ఒక్క బుల్లెట్ తో ప్రశాంతంగా ప్రాణాలు వదిలేలా చేయడం కంటే..
ఎన్ కౌంటర్ చేయడం వల్ల అత్యాచార నిందితులు ఒక్క బుల్లెట్ తో ప్రాణాలను వదులుతారని అన్నారు. అలాంటి సులువైన మరణం వారికి దక్కకూడదని ప్రొఫెసర్ కే నాగేశ్వర్ చెప్పారు. రక్తం కారుతూ కొడుతుంటే రేపిస్టులు ఉరిశిక్ష కంటే ఎక్కువ బాధను అనుభవిస్తారని అన్నారు. అలా కాకుండా.. ఎన్ కౌంటర్ చేయడం వల్ల ఒక్క బుల్లెట్ దెబ్బతో అత్యాచార నిందితులు హాయిగా, ప్రశాంతంగా జీవితాన్ని చాలించినట్టయిందని వ్యాఖ్యానించారు. పోలీసుల లాఠీ దెబ్బలు తింటే వాటి తీవ్రత తెలుస్తుందని ప్రొఫెసర్ కే నాగేశ్వర్ అన్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications