రవికుమార్ మెడికల్ ఖర్చు భరిస్తాం: వైఎస్ షర్మిల భరోసా, దీక్ష భగ్నంపై పైర్
రైతు ఆత్మహత్యపై శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్ నియంత పాలనను నిరసిస్తూ శనివారం సాయంత్రం 6 గంటలకు మీడియా మిత్రులతో మాట్లాడారు. రవికుమార్ ఆత్మహత్యపై శాంతియుతంగా దీక్షచేస్తుంటే అరెస్టు చేస్తారా..? అని ప్రశ్నించారు. దీక్షా భగ్నం చేయడాన్ని తప్పుపట్టారు. రవికుమార్ భార్యకు గుండెనొప్పి ఉందన్నారు. తల్లిదండ్రులు వృద్ధులు.. భార్యాభర్తలు ఇద్దరికీ కూడా పింఛన్ కూడా రాదన్నారు. రవికుమార్ కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హిమా ఫాలింగ్ వ్యాధి వల్ల రక్తం వస్తే ఆగే పరిస్థితి ఆ అబ్బాయికి లేదని వివరించారు. ఆ అబ్బాయికి మెడికల్ ఖర్చు చాలా అవుతుందన్నారు. రవికుమార్ కుటుంబానికి రూ.50 లక్షల వరకు అప్పులే ఉన్నాయని వివరించారు.
రవికుమార్ అనే రైతు దిగుబడి తక్కువగా రావడంతో నష్టానికి వరి ధాన్యం అమ్ముకోవడం జరిగింది. ఇది ఆత్మహత్యా..కేసీఆర్ హత్యా..? వరి ఆకరి గింజ వరకు కొంటానని, ఇప్పుడు కేసీఆర్ కొనబోమని చెబుతున్నారు. కేసీఆర్ వరి వేసుకోనిచ్చి ఉంటే రవికుమార్ ఆత్మహత్య చేసుకునేవాడు కాదు. ముమ్మాటికీ రవికుమార్ చనిపోవడానికి కారణం కేసీఆర్..చనిపోయిన రైతులను తిరిగి తీసుకురాలేరు. కేసీఆర్ రాజీనామా చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా ఈ పాపం పోయేది కాదు. కనీసం ఆ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రవికుమార్ అబ్బాయి మెడికల్ కు ఆరోగ్యశ్రీ కార్డు కూడా వర్తించకపోవడంతో 48లక్షల రూపాయల అప్పుభారం ఆ కుటుంబంపై పడింది. మొత్తం కుటుంబం భారం రవికుమార్ పై పడటంతో అప్పులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం కనుక ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోకపోతే ఉన్న ఇల్లు, భూమి పోతుంది. కుటుంబం మొత్తం రోడ్డున పడి మేం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని ఆ కుటుంబం మొత్తం ఏడుస్తూ చెప్పింది. ఇది ఆ కుటుంబం చెప్పిన మాటే కాదు ఆ గ్రామ ప్రజలంతా రవికుమార్ ఆదర్శ రైతు అని, వారిని ఆదుకోవాలన్నారు.

రైతుబంధు పేరుతో ఇస్తుంది రూ.5000 అయితే పట్టుకుంటున్నది రూ.25000. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, యంత్ర లక్ష్మీ, విత్తనాల మీద సబ్సిడీ ఇవ్వడం లేదు. ఎకరానికి రూ.25000 పట్టుకుంటున్నారు. రైతులకు ఏ విధంగా కేసీఆర్ న్యాయం చేస్తున్నారు. వరి వేసుకోవద్దనే హక్కు కేసీఆర్ కు లేదు. కొనుగోలు సెంటర్లు అన్నీ ప్రారంభం కాలేదు. కేవలం 30 శాతం మాత్రమే వరి ధాన్యం కొనుగోలు చేశారు. యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్నాం. రైతు ఎన్ని వడ్లు పండించినా వాటికి మద్దతు ధర కల్పించాలన్నారు.రవి కుమార్ ఇంట్లో పుట్టిన నినాదం వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు, వరి కొనమన్న ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు. కేంద్ర రైట్ అని నేను చెప్పడం లేదు. కేంద్రంతో మాట్లాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications