రేవంత్ డుమ్మా: కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశానికి గైర్హాజరు.. కారణం ఇదేనా..?
టీ పీసీసీ చీఫ్ ఎంపిక కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపినట్టయ్యింది. సాగర్ ఎన్నిక నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికపై గాంధీభవన్లో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం కొనసాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతోన్న మీటింగ్కు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించినట్టు సమాచారం. సమావేశానికి ఎంపీ రేవంత్రెడ్డి మాత్రం హాజరు కాలేదు.
ఎన్నికకు సంబంధించి తన అభిప్రాయాన్ని ఆయన లేఖ ద్వారా పంపారు. ఎమ్మెల్సీగా కూన శ్రీశైలం గౌడ్ను బరిలోకి దింపాలని లేఖలో రేవంత్రెడ్డి తెలిపినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ స్థానానికి పోటీ కోసం మాజీ మంత్రి చిన్నారెడ్డి, వంశీచంద్రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, హర్షవర్ధన్రెడ్డి, ఇందిరా శోభన్తో సహా 18 మంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అభ్యర్థి ఎంపికపై చర్చించి మూడు పేర్లను అధిష్టానానికి పీసీసీ పంపనుంది. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్, ఏఐసిసి కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్ పాల్గొన్నారు.

-
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications