తెలంగాణలో రాహుల్ యాత్ర.. రేపు డీజీపీ వద్దకు రేవంత్ బృందం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కన్యాకుమారి నుంచి మొదలైన యాత్ర కశ్మీర్ వరకు సాగనుంది. ఇప్పటికే తమిళనాడు, కేరళలో ముగియగా.. ఇప్పుడు కర్ణాటకలో కొనసాగుతోంది. నెక్ట్స్ తెలంగాణ రాష్ట్రంలో అడుగిడనుంది. ఇందుకు సంబంధించి టీ పీసీసీ తగిన ఏర్పాట్లు చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పాదయాత్ర శుక్రవారం కేరళ నుంచి కర్ణాటకలోకి అడుగు పెట్టింది. కర్ణాటకలో యాత్రను ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మీదుగా రాహుల్ యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. అక్టోబర్ 24వ తేదీన యాత్ర తెలంగాణలోకి అడుగుపెట్టనుంది.

రాహుల్ పాదయాత్రపై కీలక నేతలతో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్రను దిగ్విజయం చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందుకోసం సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలకు పార్టీ సీనియర్లను ఇంచార్జీలుగా నియమిస్తామని తెలిపారు. ఇక తెలంగాణలో రాహుల్ పాదయాత్రకు అనుమతి కోసం శనివారం డీజీపీని కలవనున్నట్లు రేవంత్ తెలిపారు.
రాహుల్ పాదయాత్ర కొనసాగుతుండగా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ధరించిన టీ షర్ట్ ధరపై ఇష్యూ జరిగింది. తర్వాత కాంగ్రెస్ శ్రేణులు మోడీ సూట్ గురించి ప్రస్తావించడంతో.. ఇరువర్గాలు శాంతియుతంగా ఉన్నారు.
-
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications