Samantha:పిల్లలను కనాలనుకుంది.. శాకుంతలం వద్దనుకుంది..కానీ, నీలిమ గుణ
సామ్- చై.. డైవర్స్ అంశం హాట్ టాపిక్ అవుతోంది. విడిపోయిన అంశానికి సంబంధించి ఏ చిన్న అంశమయినా సరే చర్చకు దారితీస్తోంది. నాగచైతన్యతో విడిపోతున్నట్టు సమంత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సమంత గురించి దర్శకుడు గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ ఆసక్తికర అంశాలు వెల్లడించారు. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం చిత్రంలో నటిస్తుండగా, నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

పిల్లలను కనేందుకు ఓకే..
పిల్లల్ని కనేందుకు వీలుగా శాకుంతలం సినిమాను చేయకూడదని సమంత భావించిందని తెలిపారు. శాకుంతలం కథ విన్న తర్వాత కొన్ని షరతులతో సినిమా చేసేందుకు ఓకే చెప్పిందని వివరించారు "జులై, ఆగస్టు నాటికి సినిమా పూర్తి చేయాలని గుణశేఖర్ను కోరారని వివరించారు. శాకుంతలం సినిమా తర్వాత సుదీర్ఘ విరామం తీసుకుని పిల్లల్ని కనాలన్నది సమంత ఆలోచన అని పేర్కొన్నారు. తల్లి కావాలనే బలమైన కోరిక సామ్లో కనిపించిందని తెలిపారు. తన ఆలోచనలను మేం గౌరవించి, అందుకు అనుగుణంగానే శాకుంతలం చిత్రం షెడ్యూల్ రూపొందించాం అని వెల్లడించారు. అంతలోనే ఏదో జరిగిందని.. నాగచైతన్య, సమంత విడిపోయారని వివరించారు. ఈ పరిణామం ఊహించలేదని పేర్కొన్నారు.

బాధాకరం..
విడాకులు అనేది ఒకరి జీవితంలో అత్యంత బాధాకరమైన విషయమని సమంత తెలిపింది. ఈ బాధను ఒంటరిగా అనుభవించేందుకు తనకు సమయం, అవకాశం ఇవ్వాలని కోరింది. ఇలాంటి తప్పుడు కథనాలతో తనపై కనికరం లేకుండా దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. ఎఫైర్లు, అబార్షన్లంటూ వస్తున్న కథనాలన్నీ అవాస్తవాలేనని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వాటిని తాను ఎన్నటికీ అంగీకరించేది లేదని.. ప్రామిస్ చేస్తున్నానని వివరించారు. ప్రచారంలో ఉన్నవన్నీ కట్టుకథలేనని సమంత వివరణ ఇచ్చారు.

అతనే కారణమా..?
నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత సమంత గురించి పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారు విడిపోవడానికి సమంత స్టైలిష్ ప్రీతమ్ కూడా ఒక కారణం అంటూ అతగాణ్ణి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావ్ అంటూ ప్రీతమ్, సమంతతో కలిసి ఉన్న పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు. రీసెంట్గా ఈ విషయం గురించి సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్.. వారి మధ్య ఉన్నది అక్కాతమ్ముళ్ల రిలేషన్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications