hydలో ఈ ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు.. జాగ్రత్తగా ఉండాలని నిపుణుల సూచన
తెలంగాణలో ఒమిక్రాన్ హడలెత్తిస్తోంది. కేసులున్నీ దాదాపు హైదరాబాద్లోనే ఉన్నాయి. ఒక్కటి మాత్రమే హన్మకొండలో వచ్చింది. దీంతో హైదరాబాద్లో ఏ ప్రాంతంలో కేసులు ఉన్నాయి. ఆ వైపు వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టోలిచౌకి అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇక్కడే తొలుత కేసులు వచ్చిన సంగతి తెలిసిందే.
టోలిచౌకితోపాటు యూసు్ఫగూడ, చార్మినార్ ప్రాంతాల్లో కేసులు వచ్చాయి. వీరిలో అయిదుగురు విదేశీయులు కాగా, ఒకరు మాత్రమే హైదరాబాద్కు చెందిన వ్యక్తిగా అధికారులు నిర్ధారించారు. ఒమైక్రాన్ పాజిటివ్ తొలి కేసులో బాధితుడు తన తండ్రి ఆరోగ్యం కోసం నగరానికి వచ్చాడు. అతను, మరో యువతి ఇక్కడే ఉన్నారు. మూడు రోజుల తర్వాత వారికి ఒమిక్రాన్ ఉన్నట్లు తేలడంతో ఆస్పత్రికి తరలించారు. అందులో ఓ వ్యక్తి పలు చోట్ల తిరిగాడు. ఇప్పుడు చార్మినార్, యూసుఫ్గూడ ప్రాంతాలలో కేసులు వెలుగులోకి వచ్చాయి.

ఎవరూ వారు..
దీంతో అధికారులు బాధితుల సన్నిహితులను, వారు కలిసిన వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు. కొంత మంది పరీక్షలు చేయించుకోవడానికి ఆసక్తి చూపకపోవడం అధికారులకు ఇబ్బందిగా మారింది. పోలీసుల సహకారంతో నమునాలు సేకరిస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులను, సన్నిహితులను క్వారంటైన్లో ఉండాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.

అక్కడ హైటెన్షన్
టోలిచౌకి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దానిని ఆనుకుని ఉన్న పారామౌంట్ కాలనీ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారికి అడ్డాగా మారింది. సోమాలియా, నైజీరియా, కెన్యా తదితర ఆఫ్రికా దేశాల నుంచి ఆస్పత్రుల్లో చికిత్స కోసం, విద్యార్థులుగా, ఇతర పనుల కోసం నగరానికి వచ్చి ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడికి సమీపంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ప్రముఖ ఆస్పత్రులు ఉండడం, తమకు నచ్చిన ఫుడ్ దొరుకుతుండడంతో ఆఫ్రికన్లు పారామౌంట్ కాలనీలోనే ఎక్కువగా ఉంటున్నారు.

ఆర్టీపీసీఆర్ పరీక్షలు
ఇక్కడ ఒమిక్రాన్ కేసులు బయటపడటంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో అధికారులు పారామౌంట్ కాలనీలో ఆర్టీపీసీఆర్ పరీక్షల వేగం పెంచారు. గోల్కొండ క్లస్టర్ సీనియర్ మెడికల్ అధికారి అనూరాధ ఆధ్వర్యంలో కాలనీ గేట్ నెంబర్ 1, 4 ప్రాంతాలు, చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని నివాసితుల శాంపిల్స్ను సేకరించి పరీక్షలకు పంపారు. శుక్రవారం మొత్తం 169 మందికి పరీక్షలు నిర్వహించామని వైద్య ఆరోగ్య సిబ్బంది తెలిపారు.

అలర్ట్
జూబ్లీహిల్స్, బంజరా హిల్స్.. యూసుఫ్ గూడా వద్ద కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. టోలిచౌకిలో 25-30 ఇళ్ల మధ్య కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నిన్నటివరకు రాష్ట్రంలో 9 కేసులు వెలుగుచూశాయి. హన్మకొండ మహిళ, హైదరాబాద్కు చెందిన ఒకరి వల్ల 9కి చేరింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications