దేశంలో పులులు పెరుగుతున్నందుకు సంతోషపడలా...? ప్రజలపై దాడులు చేస్తున్నందుకు బాధపడలా...?
దేశంలో పులుల సంఖ్య పెరుగుతుందని సంతోషించే సయమంలోనే హైదారాబాద్ శివారు ప్రాంతాల్లో పులులు తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చీకటి పడితే బయటకు వచ్చేందుకు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు చిరుత తమపై దాడులు చేస్తుందో అనే భయానికి గురవుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని నందివనపర్తి ,పశువుల పాక, ఆవును చంపి తింది, అంతుకు ముందు కూడ పశువుల పాకలపై దాడి చేసి రెండు పశువులపై దాడి చేసి చంపాయి. తాజాగా పశువులపై అయితే సరే మనుష్యులపై దాడి చేస్తే పరిస్థితి ఏంటని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పశువుల కోట్టాల్లోకి వెళ్లి పాలు పితికేందుకు వెళ్లేవారు భయపడుతున్నారు..ఇలా నగర శీవారు లోని ప్రాంతాల్లో 30 పైగా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. వీటిలో ఎక్కువగా నందివనపర్తి గ్రామం నుండి నమోదైన కేసులే ఎక్కువగా ఉన్నాయి.

కాగా పశువులపై దాడులు చేస్తున్న చిరుత పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాని అటవీ అధికారులు చర్యలు తీసుకున్న వాటిని పట్టుకోవడం వైఫల్యం చెందుతున్నాయి.అనేక చోట్ల పులిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నా.. పులి మాత్రం పట్టుబడడం లేదు. దీంతో ప్రజలు ఇంకా భయభ్రాంతులకు గురవుతున్నారు. కాగా ఇలాంటీ దాడులే గత రెండు సంవత్సరాల క్రితం కూడ జరిగినట్టు గ్రామస్థులు తెలిపారు.












Click it and Unblock the Notifications