మళ్లీ తెరపైకి మరియమ్మ లాకప్డెత్ కేసు: సీబీఐ విచారణ జరపాలంటూ హైకోర్టు
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అడ్డగూడురు లాక్డెత్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. పీయూసీఎల్ పిల్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. మరియమ్మ మృతిపై హైకోర్టుకు అందిన నివేదికపై ఆధారంగా మరియమ్మ లాకప్డెత్ కేసును సీబీఐకి అప్పగించదగినదని అభిప్రాయపడింది.
అంతేగాక, నవంబర్ 22న విచారణకు రావాలని సీబీఐ ఎస్పీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్కు అప్పగించాలని ఏజీని ఆదేశించింది. లాకప్లో ఉన్న సమయంలో మరియమ్మ చనిపోవడానికి బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది హైకోర్టు. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు ఎస్ఐ, కానిస్టేబుల్ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఏజీ ధర్మాసనానికి వివరించారు.

ఇక, మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున నష్ట పరిహారం చెల్లించినట్లు ఏజీ పేర్కొన్నారు. అయితే, పరిహారం ఇస్తే పోయిన మరియమ్మ ప్రాణం తిరిగి తీసుకురాలేనిదని హైకోర్టు ధర్మాసనం ఘాటుగా స్పందించింది. మరియమ్మకు ఇతర అనారోగ్య సమస్యలు ఉండటం వల్లే హార్ట్ ఎటాక్తో చనిపోయినట్లు అడ్వకేట్ జనరల్ చెప్పిన సమాధానంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
రెండో పోస్ట్మార్టం రిపోర్ట్లో మృతురాలి శరీరంపై గాయాలున్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. లాకప్లో ఉన్న మహిళను గుండె ఆగిపోయేలా ఎవరైనా కొడతారా? అంటూ నిలదీసింది హైకోర్టు ధర్మాసనం. అందుకే ఈకేసును సీబీఐ వంటి స్వతంత్ర సంస్థల దర్యాప్తు అవసరమంది. సీబీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఈ కేసు విచారణను నవంబర్ 22కి వాయిదా వేసింది.
తెలంగాణలో 9 మంది జడ్జీల బదిలీలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది జడ్జీల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జిగా ఈ.తిరుమల దేవి, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా వై. రేణుక, రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ డైరెక్ట్గా సీహెచ్కే భూపతి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా ఎం.వి. రమేశ్, నిజామాబాద్ జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జిగా కుంచాల సునీత, నల్గొండ జిల్లా ప్రిన్సిపల్ జడ్జిగా బి.ఎస్. జగ్జీవన్ కుమార్, ఆదిలాబాద్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జిగా రామకృష్ణ సునీత, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా వి.బి. నిర్మల గీతాంబ, రాష్ట్ర వ్యాట్ అప్పేలేట్ ట్రైబ్యునల్ చైర్ పర్సన్గా జి. అనుపమ చక్రవర్తి లను జడ్జీలుగా బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్వర్వులు జారీ చేసింది.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications