యాక్టివ్గా ఎందుకు లేననే అంశాన్ని బండి సంజయ్, లక్ష్మణ్ను అడగండి: రాములమ్మ సంచలనం
రాములమ్మ విజయశాంతి ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. తనకు ఏ పని అప్పగించడం లేదని మండిపడ్డారు. బండి సంజయ్, లక్ష్మణ్ లక్ష్యంగా విమర్శలు చేశారు. తన సేవలను జాతీయ నాయకత్వం తీసుకుంటుంది.. కానీ రాష్ట్ర నాయకత్వం అడగడం లేదని గుర్తుచేశారు. పార్టీలో తాను ఎందుకు యాక్టివ్గా లేనో అనే అంశంపై బండి సంజయ్నే అడగాలని సూచించారు.
తనకు ఏ బాధ్యత ఇచ్చారని పార్టీలో పనిచేయాలని రాములమ్మ ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వల్ల కొద్ది కాలంగా పార్టీకి దూరంగా ఉన్నానని వివరించారు. 24 ఏళ్ల నుంచి బీజేపీలో పనిచేస్తున్నాని తెలిపారు. ఏ బాధ్యత ఇచ్చారని పార్టీలో పనిచేయాలని అడిగారు. ఒకరిద్దరితో పార్టీలో పనులు జరగవని.. ప్రజా సమస్యలపై ఎవరికి అవగాహన ఉంటే వాళ్లను పార్టీలో ముందు వరుసలో ఉంచాలని కోరారు. బాధ్యత కలిగిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని.. అధిష్టానం దిశానిర్దేశం చేయాలని తెలిపారు.

పార్టీ తన సేవలను ఉపయోగించుకోవడం లేదని.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని తెలిపారు. పార్టీలో ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని.. పార్టీలో తనకు పాత్ర లేకుండా చేయాలని అనుకుంటున్నారని ఆరోపించారు. పని ఇవ్వకుండా చేయమంటే తనేం చేయాలని అడిగారు. జాతీయ నాయకత్వంతో ఇబ్బంది లేదని.. రాష్ట్ర నాయకత్వమే తన సేవలను వాడుకోవడం లేదన్నారు. టీమ్ వర్క్తో పనిచేస్తే బీజేపీ విజయం సాధిస్తోందని.. ఒకరిద్దరితో అధికారంలోకి రాలేమని తెలిపారు.
సీనియర్ నేతలను కలుపుకొని పోకుంటే పార్టీకే నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్ర పరిస్థితులపై జాతీయ నాయకత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ మేలు జరుగుతుందని విశ్వసిస్తున్నానని తెలిపారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని విజయశాంతి కామెంట్ చేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications