46 లక్షలు వెచ్చించిన నో యూజ్.. 3 ఆస్పత్రులు తిరిగిన నిలవని ప్రాణం..
కరోనా కోరలు చాచింది. ఆ కుటుంబంలో అలజడి రేపింది. ఇంటి పెద్దను బలి తీసుకుంది. చికిత్స కోసం ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. లక్షలకు లక్షలు దారపోసినా ఆ ప్రాణం నిలవలేదు. కరోనా రక్కసి ఓ కుటుంబంలో కల్లోలం సృష్టించింది. ఒకరు ఏకంగా రూ.46 లక్షలు ఖర్చు చేసినా.. ప్రాణాలు దక్కలేదు. పైగా కుటుంబం మొత్తం కుదేలైంది.

కూకట్ పల్లిలో ఉంటూ..
గ్రేటర్ వరంగల్ పరిధిలోని 16వ డివిజన్ ధర్మారానికి చెందిన పోలెబోయిన రాజన్బాబు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చాడు. కూకట్పల్లిలో నివాసం ఉంటూ ఐరన్, సిమెంట్ వ్యాపారంతోపాటు జిమ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల రాజన్బాబు, భార్య, ఇద్దరు కుమారులకు కరోనా వైరస్ సోకింది. అందరూ హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిక
రాజన్బాబు ఆరోగ్యం క్షీణించడంతో ముందుగా స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. హైదరాబాద్లోని మియాపూర్, సాగర్ రింగ్రోడ్డు, జేఎన్టీయూ హౌసింగ్ బోర్డు కాలనీలో గల మూడు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం రోజుకు రూ.లక్షకు పైగా వెచ్చించారు. ప్రాణాలు దక్కితే చాలు అని ఖర్చుకు వెనుకాడలేదు. డబ్బుల కోసం ఫ్లాట్ను అమ్మేశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డబ్బు తీసుకుంటూనే రాత్రిపూట ఆక్సిజన్ తీసివేస్తున్నట్లు గుర్తించారు.
Recommended Video

రాత్రిపూట ఆక్సిజన్ తీసివేస్తూ..
ఇష్టానుసారంగా డబ్బులు గుంజుతూ.. సరైన వైద్యం అందించడం లేదని అక్కడి నుంచి హైదరాబాద్లోని ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున రాజన్బాబు మృతి చెందాడు. మొత్తంగా చికిత్స కోసం ఫ్లాట్ అమ్మగా వచ్చిన డబ్బుతో పాటు ఇతరత్రా అన్నీ కలిసి రూ.46 లక్షలు వెచ్చించినా ఆయన ప్రాణాలు దక్కలేదు. భార్య, ఇద్దరు కుమారులు ఇంకా చికిత్స పొందుతున్నారు. ఇటీవల రాజన్బాబు తల్లి, సోదరి కూడా కరోనాతో మృతి చెందారు. కరోనా కాటుకు ఒకే కుటుంబంలో ముగ్గురు బలికావడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications