7 నెలలకే ప్రేమ పెళ్లిలో విషాదం, వివాహిత బలవన్మరణం, భర్తపైనే అనుమానం..?
ఏం జరిగిందో తెలియదు.. కానీ నవ వధువు మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ప్రేమించిన భర్తను శాశ్వతంగా వదిలి దూరమైపోయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరిగిన ఘటన కలకలం రేపింది. అయితే వివాహిత తల్లిదండ్రులు మాత్రం.. భర్తపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని హత్య చేసి.. నాటకాలు ఆడి ఉంటారని పేర్కొంటున్నారు.
కీసర పోలీసుస్టేషన్ పరిధిలో గల రాంపల్లిలో త్రినేయని-అక్షయ్ దంపతులు ఉంటున్నారు. వీరిద్దరూ పెద్దలను ఎదురించీ మరీ పెళ్లి చేసుకున్నారు. 7 నెలల క్రితం ఇద్దరూ ఒక్కటయ్యారు. కానీ కుటుంబ కలహాలో.. భార్య భర్తల మధ్య సఖ్యత లేదో తెలియని కానీ త్రినేయని ఆత్మహత్య చేసుకుంది. వివాహిత మరణంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మెట్టినిళ్లుతోపాటు పుట్టినిళ్లు కూడా విషాదంలో మునిగిపోయింది.

భర్త అక్షయ్ తమ కూతురిని వేధిస్తున్నారని త్రినేయని పేరంట్స్ ఆరోపించారు. అతని వేధింపులు తాళ లేకే ఆత్మహత్య చేసుకుందన్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు త్రినేయని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నివేదికలో త్రినేయని మృతికి గల కారణం తెలిసే అవకాశం ఉంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications