IGF లండన్ 2025: వాణిజ్యం నుంచి సంస్కృతుల వరకు..భారత్ యూకే దేశాల మధ్య చర్చలు..!!
లండన్, జూన్ 19: ఇంగ్లాండ్ (యుకె), భారత్ ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టిఎ) కుదిరిన తర్వాత ఇరు దేశాల మంత్రులు సమావేశం కానున్నారు. ఈ ఒప్పందం తర్వాత వాణిజ్య మంత్రుల మధ్య జరుగుతున్న తొలి బహిరంగ సమావేశమిది. జూన్ 20 వరకు 'ఐజిఎఫ్ లండన్ 2025’ జరగనుంది. దీనిలో భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటున్నారు.
ఐజిఎఫ్ లండన్ 2025 సదస్సు
యునైటెడ్ కింగ్డమ్లో ఇండియా గ్లోబల్ ఫోరమ్ (ఐజిఎఫ్) ఆధ్వర్యంలో 'ఐజిఎఫ్ లండన్ 2025’ కార్యక్రమం ప్రారంభమైంది. జూన్ 18న ప్రారంభమైన ఈ సమావేశం శుక్రవారం వరకు కొనసాగుతుంది. ఈ సదస్సులో యుకె వ్యాపార, వాణిజ్య కార్యదర్శి జొనాథన్ రెనాల్డ్స్, పీయూష్ గోయల్తో కలిసి కీలక చర్చలు జరుపుతారు. దీని ద్వారా ఉన్నత స్థాయి చర్చలకు వేదిక కానుంది.

ఈ సందర్భంగా ఇండియా గ్లోబల్ ఫోరమ్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు మనోజ్ లాడ్వా మాట్లాడుతూ, "యుకె-భారత సంబంధాలు ఈ ఒప్పందం ద్వారా ఒక కొత్త శకానికి నాంది పలుకుతాయి. ఈ ఒప్పందాన్ని వేగంగా అమలు చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అభివృద్ధికి, ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది. మా భాగస్వామ్యం ద్వారా వాణిజ్య శక్తి, ఆలోచనలు మిళితమవుతాయి" అని అన్నారు.
యుకె, భారత్ ఒప్పందం కొత్త ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, వ్యూహాత్మక దృక్పథం, వాణిజ్యం, ఆవిష్కరణలు, దౌత్యపరమైన అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రపంచ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
మూడు రోజులపాటు జరిగే ఈ గ్లోబల్ సదస్సును సిఐఐ (CII), ఇండియా గ్లోబల్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీని ద్వారా యుకెలో భారతీయ వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని, పెట్టుబడులు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు.
ఈ సదస్సు ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడి, ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications