ఢిల్లీ-యూపీ సరిహద్దులో హై టెన్షన్: 1000 మంది పోలీసులు మొహరింపు.. ఘర్షణ
వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉంది. రిపబ్లిక్ డే రోజు తీసిన ట్రాక్టర్ ర్యాలీతో ఘర్షణ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ- ఉత్తర ప్రదేశ్ సరిహద్దు ఘజిపర్ వద్ద రైతులు ఆందోళన చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడికి భారీగా పోలీసులు చేరుకున్నారు. వెయ్యి మంది పోలీసులతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలకు ఉపక్రమించారు. ట్రాక్టర్ ర్యాలీ ఘటనలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

సరిహద్దు గుండా రైతులు ఉండటంతో యూపీ స్థానిక అధికారులు ఖాళీ చేయాలని కోరారు. అయితే రైతులు వినకపోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తనపై కాల్పులు జరిపిన ఓకే.. కానీ తాను ఇక్కడినుంచి వెళ్లనని రైతు నేత రాకేశ్ తికాయిత్ అన్నారు. టిక్రీ, సింఘూ వద్ద కూడా రైతుల ఆందోళనతో భారీ భద్రతను మొహరించారు. రైతులను నిలువరించేందుకు రోడ్లను జేసీబీతో పోలీసులు తవ్వించారు.
Recommended Video
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు ఉత్తరప్రదేశ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని ఘాజిపూర్ వద్ద ఆందోళన విరమించి రోడ్లను ఖాళీ చేయాలని ఘజియాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం ఈ రాత్రి వరకు గడువు విధించారు. ఒక వేళ రైతులు ఖాళీ చేయకపోతే తామే బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తుందని హెచ్చరికలు కూడా చేసినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications