10 మంది ప్రాణం తీసిన నకిలి మద్యం, సీఎం సీరియస్, ప్రభుత్వానికి చాలెంజ్ గా !
చెన్నై/విల్లుపురం: మద్యం మత్తులో ఊగుతున్న మందు బాబులు అతిగా మద్యం సేవించారు. ప్రభుత్వ దుకాణాల్లో కాకుండా అక్రమంగా తయారు చేసిన నకిలీ మద్యం పీకలదాక తాగేశారు. నకిలి మద్యం సేవించడంతో ముగ్గురు మహిళలతో పాటు 10 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అక్రమ మద్యం తయారు చేస్తున్న నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మరక్కనం సమీపంలోని ఎక్కియార్ కుప్పం ఏరియాలో నకిలి మద్యం సేవించిన ఆరు మంది ఆదివారం చనిపోయారని స్థానిక అధికారులు ఏఎన్ఐ మీడియాకు తెలిపారు. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతగంలో నకిలి మద్యం సేవించి శుక్రవారం ఇద్దరు, ఆదివారం ఇద్దరు చనిపోయారని అధికారులు తెలిపారు.

నకిలి మద్యం సేవించిన చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగానే ఉందని అధికారులు అంటున్నారు. అక్రమ మద్యం తయారు చేసి విక్రయించి అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణం అయిన ఇద్దరిని అరెస్టు చేమశాని సీనియర్ పోలీసు అధికారి కన్నన్ మీడియాకు చెప్పారు.
అక్రమ మద్యం తయారు చేస్తున్న నిందితులు అందరిని పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి వారి కోసం గాలిస్తున్నామని ఉత్తర విభాగం డీఐజీ కన్నన్ స్థానిక మీడియాకు చెప్పారు. ఎథనాల్ ఎక్కువగా ఉపయోగించి నకిలి మద్యం తయారు చెయ్యడం వలనే అమాయకులు బలి అయ్యారని, తప్పు చేసిన వారిని ఎవ్వరిని వదిలిపెట్టమని సీనియర్ పోలీసు అధికారి కన్నన్ తెలిపారు.
నకిలి మద్యం సేవించి ప్రాణాలు పోగొట్టుకున్న వారికి రూ. 10 లక్షల పరిహారం అందిస్తామని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక్కొక్కరిని రూ. 50 పరిహారం అందిస్తామని, నకిలి మద్యం తయారు చేసి విక్రయిస్తున్న వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ అన్నారు. నకిలి మద్యం సేవించి మరణించిన కుటుంబాలకు సీఎం ఎంకే. స్టాలిన్ సానుభూతి ప్రకటించారు. నకలి మద్యం తయారు చేసిన నిందితులు చాలా మంది మాయం అయ్యారని పోలీసు అధికారులు అంటున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications