బిజెపి సీనియర్ నేత కారుపై దాడి: ఏకే47లతో వంద రౌండ్ల కాల్పులు, విషమం
ఘజియాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బ్రిజ్పాల్ టియోటియా కాన్వాయ్పై గుర్తుతెలియని దుండగులు ఏకే-47లతో కాల్పులకు తెగబడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు ఆయన కాన్వాయ్పై ఏకే-47తో దాదాపు వంద రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం.
ఘటనలో తీవ్రంగా గాయపడిన బ్రిజ్పాల్(49)ను నోయిడాలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దాడిలో మరో ఐదుగురు కూడా త్రీవంగా గాయపడ్డారు. బ్రిజ్పాల్ నోయిడాలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఇన్స్పెక్టర్ జనరల్ సుర్జీప్ పాండే తెలిపారు.

కాగా, టొయోటా ఫార్చ్యునర్ ఎస్యూవీలో వచ్చిన దుండగులు.. బ్రిజ్పాల్ ఉన్న స్కార్పియో వాహనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అనంతరం ఆయుధాలను అక్కడే పడేసి.. దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
కాల్పులకు ఏకే-47లను ఉపయోగించారని.. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. బ్రిజ్పాల్ ప్రత్యర్థులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్రిజ్పాల్ ఘజియాబాద్ వెళ్తున్న సమయంలోనే ఈ దాడి జరిగిందని తెలిపారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బ్రిజ్పాల్ను కేంద్ర సహాయ మంత్రి మహేశ్ శర్మ పరామర్శించారు. బ్రిజ్పాల్ పరిస్థితి విషమంగానే ఉందని ఆయన తెలిపారు. కాగా, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు బ్రిజ్ పాల్ అత్యంత సన్నిహితుడు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications