కొనసాగుతున్న కరోనా తీవ్రత - పెరుగుతున్న ఇన్ఫెక్షన్లు..!!
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 11,692 కేసులు నమోదయ్యాయి. గతం రోజు కేసుల కంటే కొత్త కేసుల్లో 7 శాతం తగ్గుదల కనపడింది. యాక్టివ్ కేసులు సంఖ్య 66,170కు పెరిగింది. కరోనా వల్ల దేశంలో 24 గంటల్లో మరో 28 మంది ప్రాణాలు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,42,72,256కు పెరిగినట్లు వివరించింది. కొన్ని రోజుల నుంచి రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10 వేలకు పైగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.48 కోట్ల (4,48,69,684)కు పెరిగింది. కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,31,258కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం ఇన్ఫెక్షన్లో యాక్టివ్ కేసుల శాతం 0.15గా ఉన్నట్లు వెల్లడించింది. కొవిడ్ రికవరీ రేటు 98.67 శాతంగా నమోదైనట్లు చెప్పింది.

దేశంలో చేపట్టిన వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 220.66 కోట్ల డోసులను వినియోగించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరో వారం రోజుల పాటు కేసుల సంఖ్య తీవ్రంగా ఉంటుందని, ఆ తరువాత క్రమేణా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కరోనా సబ్ వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరిగిందని వివరిస్తున్నారు.
ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. దేశంలో కేసులు పెరుగుతుండడంతో ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర సర్కారు అప్రమత్తం చేసింది. దేశంలో కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ కొనసాగుతోంది. తెలంగాణలో బూస్టర్ డోస్ పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది.

సబ్ వేరియంట్ లక్షణాలు కరోనా కంటే భిన్నంగా ఉన్నాయని వైద్యులు గుర్తించారు. తగ్గని జ్వరం, జలుబు..దగ్గు వంటి లక్షణాలతో ఇన్ఫోక్షన్లతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని గుర్తించారు. అయితే, కేసుల సంఖ్య పెరగటం పైన ఆందోళన అవసరం లేదని వైద్యులు భరోసా ఇస్తున్నారు. ఇదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications