ఘోరం: టెంపో, లారీ ఢీ: 11 మంది మృతి
లక్నో : ఉత్తర్ప్రదేశ్లో శుక్రవారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓ టెంపో, లారీ ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు. వారణాసి-లక్నో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రతాప్గఢ్ జిల్లాలోని జగత్పూర్ క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. జాన్పూర్ జిల్లాలోని ముగ్రా బాద్షాపూర్ ప్రాంతంలోని దౌలతీయ గ్రామానికి చెందిన అయిదుగురు పురుషులు, పన్నెండు మంది స్త్రీలు, మరికొంతమంది పిల్లలు కలిసి ప్రతాప్గఢ్ జిల్లా రాణిగంజ్లోని సుల్తాన్పూర్లో ఉన్న రయ్యాదేవి ఆలయానికి వెళుతుండగా ఈ ఘోరం జరిగింది.

ఫాతెన్పూర్ పోలీసుల కథనం ప్రకారం.. ప్రమాదం స్థలంలోనే ఇద్దరు మరణించారు, ఆసుపత్రికి తరలించాక మరో తొమ్మిది మంది మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం అలహాబాద్కు తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారాన్నిఆయన ప్రకటించారు.












Click it and Unblock the Notifications