సముద్రంలో నౌక మునక: 11మంది భారతీయులు గల్లంతు
సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలిప్పీన్స్లో టైఫూన్ ధాటికి సముద్రంలో ప్రయాణిస్తున్న కార్గో నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 11 మంది భారతీయులు గల్లంతయ్యారు.
టోక్యో: సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలిప్పీన్స్లో టైఫూన్ ధాటికి సముద్రంలో ప్రయాణిస్తున్న కార్గో నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 11 మంది భారతీయులు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని జపనీస్ కోస్ట్గార్డ్ వెల్లడించింది.
జపనీస్ కోస్ట్గార్డ్ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. కార్గో నౌకలో 26 మంది భారతీయులు ఉన్నారు. టైఫూన్ కారణంగా సముద్రమంతా అల్లకల్లోలంగా మారడంతో నౌక మునిగిపోయింది. 26 మందిలో 15 భారతీయ సిబ్బందిని సురక్షితంగా కాపాడగలిగారు.

కాగా, మిగతా 11 మంది గల్లంతయ్యారు. రెండు పెట్రోల్ బోట్స్, మూడు విమానాల సహాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే.. టైఫూన్ కారణంగా వాతావరణ పరిస్థితులు సక్రమంగా లేకపోవడంతో గాలింపు చర్యలు కష్టమైనట్లు తెలిపారు.
More From
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications