జై శ్రీరాం అనాలంటూ.. ఇమామ్పై దాడి... 12 మంది యువకులపై కేసు
ఉత్తరప్రదేశ్లో మరో మత వ్యతిరేక సంఘటన జరిగింది. తన ఇంటికి వెళుతున్న ఇమామ్ను అడ్డుకున్న యువకులు అడ్డగించి జై శ్రీరాం అనాలని ఒత్తిడి తెచ్చారు. అనంతరం తన గడ్డాన్ని పట్టుకుని లాగారంటూ ముజఫర్నగర్కు చెందిన ఓ ఇమామ్ పోలీసులకు పిర్యాధు చేశాడు.
ఇమామ్ ఇమ్లాక్ ఉర్ రెహమాన్ అనే ఇమాం ముజఫర్నగర్లోని తన నివాసానికి మోటారు సైకిల్పై వెళుతున్నాడు. ఈనేపథ్యంలోనే సుమారు 12మంది యువకులు ఇమాన్ను అడ్డగించారు. అనంతరం ఆయనపై దాడి చేసి తన గడ్డాన్ని కూడ గుంజినట్టు ఎస్పీ తెలిపారు.దీంతో పాటు జై శ్రీరాం అనాలంటూ ఒత్తిడి తెచ్చారని చెప్పారు.గడ్డం గీసుకున్న తర్వాతే గ్రామంలోకి అడుగుపెట్టాలని హెచ్చరించారని ఇమామ్ తన పిర్యాధులో పేర్కోన్నాడు.
ఇమామ్ పిర్యాధుతో కేసును బుక్ చేసిన పోలీసులు ప్రాధమిక విచారణ అనంతరం 12మంది యువకులను అరెస్ట్ చేశారు. కాగా వచ్చిన ఆరోపణలపై మరింతలోతైన విచారణ జిరిపి చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ శైలేష్ కుమార్ వెల్లడించారు. అయితే పూర్తి విషయాలపై విచారణ జరుపుతామని ఎస్పీ పేర్కోన్నారు.