కుప్పకూలిన భవనం: 13మంది సజీవ సమాధి
చందౌలి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాధ ఘటన చోటు చేసుకుంది. ఓ మూడంతస్తుల భవనం కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది సజీవ సమాధి అయ్యారు. వారిలో ఆరుగురు మహిళలు, ఇద్దరు పిల్లలున్నారు. మరో బాలుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కమ్రూల్ హసన్ అనే వ్యక్తి ఈ భవన నిర్మాణ కాంట్రాక్ట్ను ఓ కాంట్రాక్టర్కు అప్పగించాడు. నిర్మాణం పూర్తికాకముందే మూడు నెలల క్రితం ఈ భవనంలోకి మారాడు. వారణాసి - చందౌలీ సరిహద్దు ప్రాంతం దుల్హీపూర్ ప్రాంతంలోని ఈ భవనం ఆదివారం కుప్ప కూలిపోయింది.

నిద్రలో ఉన్నవారి హాహాకారాలు విన్న ఇరుగుపొరుగు వారు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది, ప్రకృతి వైపరీత్యాల సహాయ దళం (ఎన్డీఆర్ఎఫ్) జవాన్లు శిథిలాలను తొలగించి, 12 మంది మృతదేహాలను వెలికితీశారు.
తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు బాలలను వారణాసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతి చెందాడు.












Click it and Unblock the Notifications