దేవదాసిపై ఏళ్లుగా మత నాయకుల సామూహిక అత్యాచారం
నాసిక్: మహారాష్ట్ర అత్యంత ఘోరమైన సంఘటన వెలుగు చూసింది. ఆధునిక ప్రపంచంలో దేవదాసి అనే సంప్రదాయాన్ని కొనసాగించడమే కాకుండా 13 ఏళ్ల దేవదాసిపై మత నాయకులు పదే పదే సామూహిక అత్యాచారం చేసిన సంఘటన జరిగింది. ఆ కారణంగా ఆమె ఓ కూతురికి జన్మ కూడా ఇచ్చింది. ఈ సంఘటన ఆలోక్ తహిసీల్లోని అహ్మద్నగర్లో చేటు చేసుకుంది.
మహారాష్ట్ర అంధాశ్రధా నిర్మూలన్ సమితి (ఎంఎఎన్ఎస్) సభ్యుల జోక్యంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. వారిని జనవరి 1వ తేదీ వరకు కోర్టు పోలీసు రిమాండ్కు పంపించింది. ఏడాది వయస్సు ఉన్నప్పుడు ఆ అమ్మాయిని తాతమ్మ విక్రయించిందని ఎంఎఎన్ఎస్ న్యాయవాడి రంజన పాగర్ గవాండే చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
పదేళ్ల వయస్సు వచ్చాక ఆ అమ్మాయిని ప్రధాన నిందితుడైన గురు బాప్ లేదా గాడ్ ఫాదర్ రాజేంద్ర చవాన్ రాత్రి కార్యక్రమాలకు తీసుకుని వెళ్తుండేవాడు. పదేళ్ల వయస్సు నుంచే అమ్మాయిపై అతనితో పాటు పలువురు లైంగిక దాడి చేస్తూ వచ్చారు.
పోలీసులు ఐపిసికి చెందిన సంబంధిత సెక్షన్ల కింద, లైంగిక దాడుల నుంచి పిల్లల సంరక్షణ కింద పోలీసులు కేసు పెట్టారని, దేవదాసి చట్టం కింది సెక్షన్లను కూడా వర్తింపజేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని గవాండే చెప్పారు. ఆ అమ్మాయి అక్టోబర్లో శిశువుకు జన్మనిచ్చిందని, ఆమెను ఆందోళనకు గురి చేయడం ఇష్టం లేక ఇంత కాలం ఆగామని ఆయన చెప్పారు.