15 మందితో రామమందిరం ట్రస్టు: ఒక దళితుడికి చోటు..67 ఎకరాల్లో: అమిత్ షా
న్యూఢిల్లీ: చారిత్రాత్మకమైన రామ మందిరం ట్రస్టులో 15 మంది సభ్యులకు చోటు కల్పించబోతున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. దళిత సామాజిక వర్గానికి ప్రాతినిథ్యాన్ని కల్పిస్తామని అన్నారు. 15 మందిలో ఒక దళితుడికి రామమందిరం ట్రస్టులో తీసుకుంటామని అన్నారు. కోట్లాదిమంది హిందువుల ఆశయానికి అనుగుణంగా అయోధ్యలో మొత్తం 67 ఎకరాల్లో రామమందిర ఆలయం రూపుదిద్దుకుంటుందని చెప్పారు.
श्री राम जन्मभूमि पर सर्वोच्च न्यायालय के आदेशानुसार आज भारत सरकार ने अयोध्या में प्रभु श्री राम के भव्य मंदिर के निर्माण की दिशा में अपनी कटिबद्धता दिखाते हुए श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र नाम से ट्रस्ट बनाने का ऐतिहासिक निर्णय लिया है।
— Amit Shah (@AmitShah) February 5, 2020
రామమందిరం ట్రస్టును ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం లోక్సభలో ప్రకటించిన వెంటనే.. అమిత్ షా తన ట్విట్టర్కు పని చెప్పారు. వరుసగా ట్వీట్లను చేశారు. ట్రస్టుకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ట్రస్టు సభ్యులను త్వరలోనే ఎంపిక చేస్తామని అన్నారు. అయోధ్యలో 67 ఎకరాల స్థలాన్ని త్వరలోనే ట్రస్టుకు బదలాయిస్తామని చెప్పారు.
भारत की आस्था और अटूट श्रद्धा के प्रतीक भगवान श्री राम के मंदिर के प्रति प्रधानमंत्री श्री @narendramodi जी की प्रतिबद्धता के लिए मैं उनका कोटि-कोटि अभिनन्दन करता हूँ।
— Amit Shah (@AmitShah) February 5, 2020
आज का यह दिन समग्र भारत के लिए अत्यंत हर्ष और गौरव का दिन है।
కోట్లాదిమంది హిందువుల మనోభావాలు ప్రతిఫలించేలా ట్రస్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్రగా నామకరణం చేశారని అన్నారు. దీనికి ఆయనకు కృతజ్ఙతలను తెలియజేస్తున్నానని చెప్పారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా.. అత్యద్భుత రామమందిరాన్ని నిర్మిస్తామని, త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ఆరంభమౌతాయని తాను ఆశిస్తున్నట్లు అమిత్ షా అన్నారు.
श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट में 15 ट्रस्टी होंगे जिसमें से एक ट्रस्टी हमेशा दलित समाज से रहेगा। सामाजिक सौहार्द को मजबूत करने वाले ऐसे अभूतपूर्व निर्णय के लिए मैं प्रधानमंत्री श्री @narendramodi जी को अनेक अनेक बधाई देता हूँ।
— Amit Shah (@AmitShah) February 5, 2020