వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్థాన్ లో దారుణం: విద్యార్థినిపై పాఠశాల యజమాని సామూహిక అత్యాచారం, ఆపైన హత్యాయత్నం

రాజస్థాన్ లో విద్యార్థినిపై పాఠశాల యజమాని సామూహిక అత్యాచారం, ఆపైన హత్యాయత్నం

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చురు: ఓ విద్యాసంస్థ యజమాని తన బంధువుతో కలిసి తన పాఠశాలలోనే చదువుకుంటున్న ఓ విద్యార్థిని(15)పై అత్యాచారం చేయడమే కాక, తమ కిరాతకం బయట పడుతుందన్న అనుమానంతో ఆ విద్యార్థినిని మట్టుబెట్టేందుకు ప్రయత్నించిన ఉదంతమిది.

రాజస్థాన్ లోని చురు జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన ఈ అమానుష ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక చురు జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్లస్ టూ చదువుతోంది.

15-year old Student gang raped by School Owner

తన పాఠశాలలో చదువుతున్న ఆ బాలికను ఆమె ఇంటినుంచే సదరు పాఠశాల యజమాని అపహరించినట్లు సమాచారం. ఆపైన అతడు తన బంధువుతో కలిసి అత్యాచారానికి పాల్పడి, ఎక్కడ దొరికిపోతామో అన్న భయంతో ఆ విద్యార్థినిని చంపేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలో వారు ఆ విద్యార్థిని కళ్ళలో పొడిచి, వెన్నెముకను కూడా విరిచేశారు. ప్రస్తుతం ఆ విద్యార్థిని జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

మరోవైపు ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన వారే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుంటే తమ పిల్లలకు రక్షణ ఎక్కడుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

English summary
A 15-year old girl was allegedly gang-raped in Churu district yesterday. The class 11 student, studying in a private school was first abducted from her house by the owner of the school and was raped along with his relative.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X