ప్రయాణికులంతా గాఢ నిద్రలో: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 22మంది మృతి!
బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో.. తప్పించుకునే వీలు లేకుండా పోయింది.
బరేలి: ఉత్తరప్రదేశ్ లోని బరేలిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సోమవారం అర్థరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత చోటు చేసుకున్న ఈ ఘటనలో బస్సు-ట్రక్కు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఘటనలో 22మంది మృత్యువాత పడగా.. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ట్రక్కును ఢీకొన్న తర్వాత బస్సులో మంటలు అంటుకున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. బరేలీ షహ్జాన్ పూర్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకోగా.. ప్రమాద స్థలంలో కొన్ని నిర్మాణ పనులు జరుగుతున్నట్లుగా సమాచారం. బస్సును డ్రైవర్ సరైన మార్గంలో నడపనందువల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో.. తప్పించుకునే వీలు లేకుండా పోయింది. ఆ వెంటనే మంటలు అంటుకోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications