డేంజరస్ తీర్పు-సుప్రీంకోర్టుపై 17 విపక్ష పార్టీల ఫైర్-సమీక్ష కోరుతూ ఉమ్మడి ప్రకటన

మనీలాండరింగ్ నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు గతవారం ఇచ్చిన తీర్పుపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టంలో సవరణలు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టంలో ఈడీకి కల్పించిన అపరిమిత అధికారాల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కానీ సుప్రీంకోర్టు వాటిని తోసిపుచ్చింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పును విపక్షాలు ప్రమాదకర తీర్పుగా అభివర్ణించాయి. ఈ మేరకు కాంగ్రెస్, టీఎంసీ సహా మొత్తం 17 విపక్ష పార్టీలు ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి ఏజెన్సీలకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ 2019లో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)కు చేసిన సవరణలను సమర్థిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును 17 ప్రతిపక్ష పార్టీలు "ప్రమాదకరమైనవి"గా అభివర్ణించాయి. ఈ "ప్రమాదకరమైన తీర్పు స్వల్పకాలికంగా ఉంటుందని, రాజ్యాంగ నిబంధనలు త్వరలో అమలులోకి వస్తాయని తాము ఆశిస్తున్నాము" అని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకె, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఐ(ఎం), సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ ప్రతినిధులు సంతకం చేసిన ప్రకటనను విడుదల చేశాయి.

17 opposition parties seek review on scs pmla orders, termed as dangerous verdict

పీఎంఎల్ఏ చట్టాన్ని సవాల్ చేస్తూ దాదాపు 250 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. సవరించిన చట్టం ప్రకారం ఈడీకి ఇచ్చిన విస్తృత శ్రేణి అధికారాల చెల్లుబాటును జూలై 27న సుప్రీంకోర్టు సమర్థించింది. అరెస్టు చేసే అధికారాలతో పాటు ఈ చట్టంలో ఉన్న పలు సెక్షన్లను వ్యతిరేకిస్తూ పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాల్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈ తీర్పును సమీక్షించాలని ఆయా పార్టీలు సుప్రీంకోర్టును కోరాయి.

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైన ఎనిమిదేళ్లలో గత యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే ఈడీ దాడులు 26 రెట్లు పెరిగాయని, కానీ నేరారోపణ రేటు చాలా తక్కువగా ఉందని విపక్షాలు తెలిపాయి.3,010 మనీలాండరింగ్-సంబంధిత సోదాల్లో కేవలం 23 మంది నిందితులు మాత్రమే దోషులుగా నిర్ధారణ అయ్యారని వెల్లడించాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ 112 తనిఖీలలో మనీలాండరింగ్ నేరారోపణలు లేవన్నారు.
నేషనల్ హెరాల్డ్ ప్రచురణకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ గాంధీలను ఈడీ ప్రశ్నించినప్పుడు కక్షసాధింపు విమర్శలు వచ్చాయి.

ఈ సవరణలను పార్లమెంటులో ఏ విధంగా ముందుకు తెచ్చారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఆ ప్రశ్న ఇప్పటికే సుప్రీంకోర్టు ముందు ఉంది. వీటిని 'మనీ బిల్లు'గా ప్రవేశపెట్టి ఫైనాన్స్ యాక్ట్ కింద ఆమోదించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మనీ బిల్ రూట్ అంటే కొత్త నిబంధనలకు తుది ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపే ముందు లోక్‌సభ నుండి ఆమోదం మాత్రమే అవసరం. ఇది రాజ్యసభ ద్వారా తిరస్కరించే అవకాశం లేదని ఆయా పార్టీలు తెలిపాయి. ఇక్కడ ప్రభుత్వం దీన్ని ఆమోదింపజేసుకునేందుకు తగినంత సంఖ్యాబలం కూడా లేదని గుర్తుచేశాయి.

ఫైనాన్స్ చట్టం ద్వారా సవాలు చేసిన సవరణలు చట్టపరంగా చెల్లవని రేపు సుప్రీం కోర్టు భావిస్తే అప్పుడు ఈ మొత్తం విచారణ వ్యర్థం అవుతుందని, విలువైన కోర్టు సమయం వృథా అయినట్లేనని విపక్షాలు తమ ప్రకటనలో తెలిపాయి.
మనీ బిల్లు తప్పనిసరిగా కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి డబ్బును కేటాయించడం, పన్ను విధించడం, ఇతర విషయాలపై చట్టాలు చేయడానికి ఉపయోగించబడదనేది విపక్షాల వాదనగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+