అత్యాచారం నుండి తప్పించుకొని, చివరికిలా...
18 ఏళ్ళ యువతిపై అత్యాచారం చేసేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తే , వారి నుండి తప్పించుకొనేందుకుగాను పారిపోతూ రైలు ఢీకొని ఆమె చనిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకొంది.
భోపాల్:ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తే, వారి నుండి తప్పించుకొని పారిపోతూ 18 ఏళ్ళ యువతి రైలు ఢీకొని మరణించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.మృతురాలి కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దతియా జిల్లాలోని గోవింద్ పురా గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకొంది. ఉదయం ఐదున్నర గంటల సమయంలో ఓ యువతి బహిర్భూమికి వెళ్ళింది.
అయితే అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. వారి బారి నుండి తప్పించుకొనేందుకుగాను బాధితురాలు ప్రయత్నించింది. నిందితుల నుండి ఎలాగోలా తప్పించుకొంది.

అంతే కాదు వారి నుండి తనను తాను రక్షించుకొనేందుకుగాను ఆమె రైలు పట్టాలపై పరుగెత్తింది.అయితే ఎదురుగా వచ్చిన రైలు ఆమెను ఢీకొట్టింది.బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికిప్పుడే తామేమీ చెప్పలేమంటున్నారు.యువతి తండ్రి తొలుత ఓ రకంగా తర్వాత వేరే రకంగా చెప్పారని పోలీసులు చెప్పారు.
తన ఇంటి సమీపంలో నివసించే ఇద్దరు వ్యక్తులు ఆమెను రైలు ముందు తోసేశారని తొలుత ఫిర్యాదు చేశారని చెప్పారు. అయితే తమ బంధువు జరిగిన ఘటనను చూశారని, ఆమె చెబితేనే అసలు విషయం తెలిసిందని బాధితురాలి తండ్రి చెప్పారు. మరుగుదొడ్లు లేని కారణంగానే బహిర్భూమికి వెళ్ళిన మహిళలు లైంగిక వేధింపులకు గురౌతున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications