సుప్రీం కోర్టు, ఆపరేషన్ స్మైల్ 280 మంది రక్షణ
బెంగళూరు: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బెంగళూరు నగరంలో మొదటి సారి ఆపరేషన్ స్మైల్ ను ప్రారంభించారు. రోడ్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ ల దగ్గర చిన్నారులు, పిల్లలను అడ్డం పెట్టుకుని భిక్షాటన చేస్తున్న వారిని రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారు.
గురువారం ఒక్క రోజు 190 మంది పిల్లలతో పాటు 280 మందిని రక్షించామని ఆపరేషన్ స్మైల్ సమన్వయ అధికారి, బెంగళూరు తూర్పు విభాగం అడిషనల్ పోలీసు కమిషనర్ హరిశేఖరన్ తెలిపారు. అతి త్వరలోనే బెంగళూరు నగరంలో పిల్లలు భిక్షాటన చెయ్యకుండ తగిన చర్యలు తీసుంటామని అన్నారు.

గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 70 ప్రత్యేక బృందాలు ఎర్పాటు చేసి నగరంలోని మెజస్టిక్, సిటి రైల్వే స్టేషన్, యశవంతపురం, కంటోన్మెంట్, శివాజీనగర్, సిటి మార్కెట్, బనశంకరి తదితర చోట్ల 190 మంది పిల్లలను రక్షించామని అన్నారు.
పిల్లలను మడివాళలోని బాలల పునరావాస కేంద్రాలకు తరలించామని హరిశేఖరన్ తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో భిక్షాటన చేస్తున్న పిల్లలను రక్షించి వారికి చదువు చెప్పించి వసతి కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications