కార్గిల్: భూమిలో లక్ష సజీవ బాంబులు (ఫోటోలు)
భోపాల్: మధ్యప్రదేశ్ లోని జబల్ నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు బాంబు పేలుళ్లు జరుగుతాయో అంటూ హడలి చస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నామని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
జబల్ పూర్ నగరం కింద దాదాపు లక్ష బాంబులు పాతిపెట్టడమే వారి ఆందోళనకు కారణం. 1999 లో కార్గిల్ యుద్దం సమయంలో పేలని, అధికారులు తిరస్కరించిన వేలాది బాంబులను జబల్ పూర్ ప్రాంతంలోని అర్డినెన్స్ ఫ్యాక్టరి ఖమారియా (ఓఎఫ్ కే)లోని భూగర్బంలో పాతిపెట్టారు.
ఆ బాంబులు ఇప్పటి వరకు అక్కడే సజీవంగా ఉన్నాయి. ఆ బాంబులు పేలితే భూకంపం వచ్చి నగర వాసులకు భారీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. గత కొన్ని సంవత్సరాలు ఈ ప్రాంతంలో వరస పెట్టి బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి.

మళ్లి పేలుడు
గత శుక్రవారం రాత్రి పేలుడు సంభవించి ఇద్దరు ఓఎఫ్ కే ఉద్యోగులు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

లక్ష బాంబులు
ఓఎఫ్ కే ప్రాంతంలో లక్షకు పైగా 84 ఎంఎం మోర్టార్లు, ఎల్ 70, బీఎంపీ 2 షెల్స్ ఉన్నాయని అధికారులు అంచనా వేశారు.

మ్యాగజైన్ ఎఫ్ 12 ప్రాంతం
కార్గిల్ యుద్దం సమయంలో పేలుడు పదార్థాలు దాచి ఉంచిన మ్యాగజైన్ ఎఫ్ 12 ప్రాంతం మరింత ప్రమాదకరం అని వెలుగు చూసింది.

చెప్పినా పట్టించుకోలేదు
తాము అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఆర్డీఎక్స్ ఉంది
రోసోబోరోన్ ఎక్స్ పోర్ట్ సంస్థ (రష్యా) 2013లో సరఫరా చేసిన నాలుగు వేల కిలోల ఆర్గీఎక్స్ కూడా జబల్ పూర్ నగరం సమీపంలోనే నిక్షిప్తమై ఉందని సమాచారం.

నాణ్యతలేదని
రష్యా సరఫరా చేసిన ఆర్టీఎక్స్ నాణ్యత లేదని గుర్తించిన అధికారులు దానిని భూగర్బంలో పాతిపెట్టారు.

స్టాక్ తీసుకోకుండానే సరఫరా
పాత స్టాక్ తీసుకోకుండానే రష్యా 2014లో ఆర్టీఎక్స్ సరఫరా చేసిందని ఓఎఫ్ కే ఉద్యోగులు అంటున్నారు.

అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం
జబల్ పూర్ నగరం నిత్యం అత్యంత రద్దీగా ఉంటుంది. అక్కడ ఎప్పుడు బాంబు పేలుడు జరుగుతుందో అంటూ స్థానికులు హడలిపోతున్నారు.

ఓ దేశంతో యుద్దం
ఓ దేశంతో యుద్దం చెయ్యడానికి అవరసమైన బాంబులు ఇక్కడ ఉన్నాయని జాయింట్ కన్సల్టేషన్ మిషనరీ సభ్యుడు అరుణ్ దూబే అంటున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications