పహల్గంలో పడవ బోల్తా .. ఇద్దరి మృతి, నలుగురికి గాయాలు
శ్రీనగర్ : పర్యాటక ప్రాంతం పహల్గాంలో మరోసారి పడవ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఇద్దరి మృతి

పహల్గాం నుంచి పర్యాటకులతో పడవ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పడవలో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఇద్దరు చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. మరో నలుగురు గాయపడ్డారని పేర్కొన్నారు. పడవ ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. పడవ ప్రమాదంపై జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటంిచారు. మరోవైపు గతంలో లిద్దర్ నదిలో కూడా మరో పడవ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ప్రయాణికులను టూరిస్ట్ గైడ్ అహ్మద్ దర్ కాపాడారు. బలమైన గాలులు వీయడంతో ఆయన నదిలో చిక్కుకొని మృత్యువాత పడ్డారు. దర్ ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరు కొనియాడారు.












Click it and Unblock the Notifications