దారుణం: నిద్రిస్తునన అక్కాచెల్లెళ్ల సజీవదహహనానికి యత్నం
నిద్రిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు సకాలానికి ఆస్పత్రికి తరలించడంతో వారి ప్రాణాలు నిలిచాయి.
బరేలీ: నిద్రిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు సకాలానికి ఆస్పత్రికి తరలించడంతో వారి ప్రాణాలు నిలిచాయి. ఉత్తరప్రదేశ్లోని బరేలి జిల్లా నవాబ్ గంజ్ ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది.
శుక్రవారం రాత్రి దుండగులు తలుపులు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి ప్రవేశించారు. నిద్రపోతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలకు వారు లేచి చూసేసరికి దుండగులు అక్కడినుంచి పారిపోయారు. 18 యేళ్ల గుల్షాన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆమె చెల్లెలు ఫిజా(17)కు 40 శాతం కాలిగాయాలయ్యాయి.

నిందితులు ఎవరో, ఎందుకు వచ్చారో తమకు తెలియదని ఫిజా చెప్పింది. ఎవరితోనూ తమకు గొడవలు లేవని, రాత్రిపూట ఒకే మంచంపై నిద్రిస్తున్న తమ ఇద్దరికీ నిప్పంటించారని చెప్పింది. తాను లేచి వారి ముఖాలు చూసేందుకు ప్రయత్నించానని, అయితే అప్పటికే పారిపోయార వెల్లడించింది.
ఈ సంఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. నిందితులను సాధ్యమైనంత త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications