ఎన్కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఓ ఇంట్లో దాగి ఉన్న ముష్కరులపై కాల్పులు జరిపి హతమార్చినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను బుధవారం ఉదయం సైన్యం హతమార్చింది. ఓ ఇంట్లో దాగివున్న ముష్కరులపై కాల్పులు జరిపి మట్టుబెట్టినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
బారాముల్లాలోని రఫియాబాద్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు, భద్రతాసిబ్బంది సంయుక్తంగా మంగళవారం రాత్రి నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో పజల్పొరా గ్రామంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారని గుర్తించిన భద్రతాసిబ్బంది ఆ ఇంటిని చుట్టుముట్టారు. గమనించిన ముష్కరులు జవాన్లపైకి కాల్పులు జరిపారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలంలో రెండు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications