మావోల ప్రాబల్య ప్రాంతాల్లో బీహార్ పోలింగ్ (వీడియో)
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో బాగంగా రెండో దశ పోలింగ్ శుక్రవారం ప్రారంభం అయ్యింది. పోలింగ్ జరుగుతున్న ఆరు జిల్లాలలో పోలీసులు గట్టి బందోబస్తు ఎర్పాటు చేశారు. సున్నితమైన ప్రాంతాలలో సాయుధ బలగాలను రంగంలోకి దింపారు.
శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో పోలింగ్ ప్రారంభం అయ్యే సమయానికి అర్వాల్, రోహ్ తాస్, కైమూర్, ఔరంగాబాద్, గయా, జహనాబాద్ జిల్లాలలోని పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకున్నారు. మొత్తం 32 శాసన సభ నియోజక వర్గాలలో పోలింగ్ జరుగుతున్నది.

456 మంది అభ్యర్థులు వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తీవ్రవాదులు, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న 11 నియోజక వర్గాలలో మద్యాహ్నాం 3 గంటలకు, 12 నియోజక వర్గాలలో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ నిలిపి వేస్తున్నామని అడిషనల్ చీఫ్ ఎన్నికల అధికారి ఆర్. లక్ష్మణణ్ తెలిపారు.
9 నియోజక వర్గాలలో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని వివరించారు. మొత్తం 86,13,870 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని, అందు కోసం 9,119 పోలింగ్ కేంద్రాలు ఎర్పాటు చేశామని అన్నారు. ఉదయం 10 గంటల వరకు 20.61 శాతం పోలింగ్ జరిగిందని, ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదని చెప్పారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications