వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్నేహం చేయలేదని యువతిని పొడిచి చంపాడు

|
Google Oneindia TeluguNews

20-year-old woman stabbed to death in Delhi
న్యూఢిల్లీ: తనతో స్నేహం చేయలేదనే నెపంతో ఓ యువతిని కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపాడు ఓ దుండగుడు. అడ్డుకునేందుకు యత్నించిన ఆమె తల్లిపై కూడా చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. బాధిత యువతి(20)ని గత కొద్ది నెలల నుంచి నిందితుడు తనతో స్నేహం చేయాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. తాను స్నేహం చేయలేనని చెప్పినా వినకుండా ఆమె వెంట పడుతుండటంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా, శుక్రవారం ఉదయం ఆ యువతి ఇంటికి వచ్చిన నిందితుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితం ఆమెను పొడిచాడు. అడ్డుకునేందుకు వచ్చిన ఆమె తల్లిపై కూడా దాడి చేశాడు. ఆ తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘటనలో యువతి మృతి చెందగా, ఆమె తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

English summary
A 20-year-old woman was stabbed to death while her mother was injured by a stalker in Delhi, police said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X