న్యాయం కోరుతూ కోర్టుకెక్కిన 200 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు
తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, న్యాయం చెప్పాలంటూ దాదాపు 200 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు కోర్టుకెక్కారు.
బెంగళూరు: బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న దాదాపు 200 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) జవాన్లు కోర్టుకెక్కారు.
ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసినా ప్రయోజనం లేకపోవడంతో.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వారు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తమకు సరైన తిండి పెట్టడం లేదని, అలవెన్సులు చెల్లించడం లేదని, పేరుకే అంతర్జాతీయ విమానాశ్రయం.. కానీ ఇకడ పని చేసే పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని, తమకు న్యాయం చేయాలంటూ వారు తమ పిటిషన్ లో కోరారు.

విమానాశ్రయాలతోపాటు ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భద్రతా బాధ్యతలను సీఐఎస్ఎఫ్ సిబ్బంది చూసుకుంటారు. కేంద్ర భద్రతా దళాలలో భాగమైన సీఐఎస్ఎఫ్ తో పాటు వివిధ దళాలు తీవ్ర ఒత్తిడి నడుమ పనిచేస్తున్నాయి.
గత మూడేళ్లలో 344 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే 15 మంది ఇలా అసువులు బాశారు. పని వాతావరణం దుర్భరంగా ఉండటం, తీవ్రమైన ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు.. ఇలా రకరకాల కారణాలతో సీఐఎస్ఎఫ్ జవాన్లు అర్థంతరంగా తనువు చాలిస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications