రాజస్థాన్లో ఇసుక తుఫాను బీభత్సం, 22 మంది మృతి: ఢిల్లీలోను గాలి దుమారం
న్యూఢిల్లీ/జైపూర్: రాజస్థాన్లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో ఈ ధాటికి 22 మంది మృతి చెందారు. ఒక్క భరత్పూర్లోనే 11 మంది మృత్యువాత పడ్డారు. రాజస్థాన్ ఈశాన్య ప్రాంతాలను బుధవారం సాయంత్రం ఇసుక తుఫాను చుట్టేసింది. మరోవైపు ఎండలు కూడా మండిపోతున్నాయి.
విపత్తుల నిర్వహణ శాఖ తెలిపిన వివరాలప్రకారం భరత్పూర్లో పదకొండు మంది, ధోల్పూర్లో ఐదుగురు, అల్వార్లో నలుగురు, ఝన్ఝున్, బికనేర్లో ఒక్కొక్కరు మృతి చెందారు.

కరౌలీలోని ఓ భవనం గోడ కూలి ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. పలుచోట్ల పెద్ద వృక్షాలు నేల కూలండంతో వందమందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
బుధవారం రాత్రి ఇసుక తుఫాను, పిడుగుల కారణంగా వేలాది విద్యుత్ స్తంభాలు నేలకూలాయని, దీంతో పలు చోట్ల చీకటి అలుముకుందని, మరమ్మత్తుకు సమయం పడుతుందని అధికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ సిబ్బందిని ముఖ్యమంత్రి వసుంధరా రాజే అప్రమత్తం చేశారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీలోను బుధవారం సాయంత్రం గాలి దుమారం చెలరేగింది. పలుప్రాంతాల్లో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. గాలి దుమారం కారణంగా పదిహేను విమానాలను దారి మళ్లించారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications