ఆ యువతి ఏడిస్తే కళ్లలో నుండి రక్తం చుక్కలు
జైపూర్: రాజస్థాన్కు చెందిన ఇరవై రెండేళ్ల యువతి లక్ష్య బైస్ అనే యువతి కళ్లలో నుండి ఆమె ఏడ్చినప్పుడు రక్తం కారుతోంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా.. ఆమె ఆరోగ్యంలో ఎలాంటి సమస్య లేదని చెబుతున్నారు. కానీ, కళ్లలో నుండి రక్తం కారేందుకు అసలు కారణం ఏమిటో తెలియడం లేదు.
వైద్య చరిత్రలోనే అత్యంత అఏరుదైన ఈ సమస్య బారిన పడిన మూడో వ్యక్తిగా లక్ష్యను వైద్యులు గుర్తించారు. ఇప్పటి వరకు లక్నోలో ఒకరు, కోల్కతాలో ఒకరు ఇటువంటి సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు.

లక్ష్య బైస్ సమస్యను పరిశీలించిన రాజస్థాన్ రాష్ట్రం కోటాలోని ఓ వైద్యశాల డాక్టర్లు.. రక్తం గడ్డకట్టక పోవడం వల్లే ఆమె కళ్లలో నుండి అప్పుడప్పుడు రక్తం చుక్కలు పడుతుండవచ్చునని చెప్పారు. ఈ సమస్యకు కారణాలు ఏమిటో తెలుసుకోవడానికి జరపాల్సిన పరీక్షలు ఖరీదైనవని, పైగా అవి మన దేశంలో అంతగా అందుబాటులో లేవని చెప్పారు.












Click it and Unblock the Notifications