వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

25 మంది కళాకారులు దుర్మరణం

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: ఒడిషా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది మరణించారు. 15 మందికి పైగా తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దేవ్ ఘఢ్ జిల్లాలోని జార్జ్ వ్యాలీ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు.

40 మంది కళాకారులు బస్సులో రెంటా ప్రాంతం నుంచి దేవ్ ఘడ్ కు బయలు దేరారు. మార్గం మద్యలో బస్సు అదుపుతప్పి 300 అడుగుల లోతున్న లోయలోపడింది. ఈ ప్రమాదంలో 25 మంది కళాకారులు సంఘటనా స్థలంలో మరణించారని పోలీసు అధికారులు చెప్పారు.

25 People killed, 11 injured as bus falls in gorge

తీవ్రగాయాలైన బాధితులను ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారు భారతి నాట్య సమితికి చెందిన వారని పోలీసులు దర్యాప్తులో వెలుగు చూసింది. గాయాలైన వారు దేవ్ ఘఢ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసు అధికారులు తెలిపారు.

ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని కేసు దర్యాప్తులో ఉందని దేవ్ ఘఢ్ జిల్లా పోలీసు కమిషనర్ చెప్పారు. బస్సువేగంగా నడపడం వలనే ప్రమాదం జరిగిందని పోలీసు అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మరణించాడని పోలీసులు చెప్పారు.

English summary
At least 25 people were killed and 11 others critically injured when a bus carrying artists of an opera troupe fell into a gorge in Deogarh district of Odisha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X