మైసూరులో ఉరేసుకుని ఇన్ఫోసిస్ టెక్కీ ఆత్మహత్య

 25-year-old Infosys employee allegedly commits suicide in Mysore
బెంగళూర్: కర్ణాటకలోని మైసూరులో గల ఐటి కంపెనీలో పనిచేస్తున్న పాతికేళ్ల టెక్కీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత మూడు నెలల కాలంలో హైదరాబాద్, బెంగళూర్, చెన్నైల్లో టెక్కీలు ఆత్మహత్య చేసుకున్న ఘటనల్లో ఇది ఐదోది. అతన్ని మోహన్ కృష్ణగా గుర్తించారు. అతను ఇన్ఫోసిస్‌లో టెక్నికల్ ఇంజనీరుగా మూడు నెలల క్రితం చేరాడు.

సంఘటనా స్థలంలో అతను రాసిపెట్టిన సూసైడ్ నోట్ లభించింది. తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని అతను రాసి పెట్టాడు. ఒంటరిగా విడిచివెళ్తున్నందుకు తల్లిదండ్రులకు అతను ఆ నోట్‌లో క్షమాపణలు చెప్పాడు. తన ఫోన్‌ను వారి వద్ద ఉంచుకోవాలని కోరాడు.

వినాయక చవితి పండుగ కోసం అతను ఇంటికి వ్చచాడని, ఏం జరిగిందో తెలియదని, తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మోహన కృష్ణ తండ్రి కృష్ణయ్య చెప్పారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఐటి కంపెనీల్లో పనిచేస్తున్న యువతీ యువకులు తరుచుగా ఆత్మహత్యలకు పాల్పడడం కలవరానికి గురి చేస్తోంది. ఇటీవలి కాలంలో ఐటి కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు ఆత్మహత్యలకు పాల్పడడం ఓ సామాజిక సమస్యగా మారినట్లే కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+