గోవా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో 26 మంది రోగుల మృతి
గోవా మెడికల్ కాలేజీ ఆస్పత్రి (జీఎంసీహెచ్)లో మంగళవారం 26 మంది కరోనా రోగులు చనిపోయారని గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే చెప్పారు. ఇది ప్రభుత్వ ఆస్పత్రి.
మంగళవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో రోగులు చనిపోయారని ఆయన తెలిపారు. కానీ వారు ఎందుకు మృతిచెందారో కారణం చెప్పలేదు.
రాత్రి 2 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో ఆక్సిజన్ సరఫరా పైన, కోవిడ్ రోగులు చనిపోవడం పైన హైకోర్టు విచారణ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ముగ్గురు నోడల్ ఆఫీసర్లను నియమించిందని, వారు ఏం విచారణ చేశారో చూడాలని రాణే అన్నారు.
ఆక్సిజన్ నిర్వహణలో లోపం ఎక్కడుందో ముఖ్యమంత్రిని అడుగుతానని చెప్పారు. జీఎంసీ హాస్పిటల్ సిబ్బంది ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కష్టపడుతున్నారని, ప్రస్తుతం ఈ ఆస్పత్రిపై భారం ఎక్కువగా ఉందని రాణే అన్నారు.
అయితే, మీడియాతో మాట్లాడిన ఆయన ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడిందని అంగీకరించారు.
"కోవిడ్-19 వార్డులో ఆక్సిజన్ సరఫరా కాసేపు నిలిచిపోయింది. దానివల్ల రోగులకు కొంత ఇబ్బంది వచ్చుండచ్చు" అని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నట్లు పీటీఐ చెప్పింది.
"హైకోర్ట్ ఈ అంశంపై విచారణ జరపాలి. హైకోర్ట్ జోక్యం చేసుకుని ఆక్సిజన్కు సంబంధించి ఒక శ్వేతపత్రం రూపొందించాలి. అసలు విషయం అప్పుడే బయటికొస్తుంది" అని మంత్రి రాణే అన్నారు.
ఈ ఘటనలపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పందించారు.
"ప్రభుత్వం ప్రతిరోజు 600 ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తోంది. ఇది పైప్లైన్ ఆక్సిజన్ సప్లైకి అదనం. ఆక్సిజన్ నిరంతరం సరఫరా జరిగేందుకు మరో పది రోజుల్లో గోవా మెడికల్ కాలేజీలో 20 వేల లీటర్ల ఆక్సిజన్ ట్యాంకును ఏర్పాటుచేస్తున్నాం. ట్యాంకర్లను నడిపే డ్రైవర్ల వల్లే సమస్య ఎదురవుతోందని మాకు అర్థమైంది, అందుకే మరింత నిపుణులైన డ్రైవర్లను నియమిస్తాం" అని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు.
గోవాలో మే 24 వరకు కఠిన లాక్డౌన్ అమల్లో ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- రుయాలో 11 మంది మృతి: 5 నిమిషాలా, అరగంటా... ఆక్సిజన్ సరఫరా ఎంతసేపు నిలిచిపోయింది
- భారత్లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- కరోనా వైరస్: పిల్లల్లో సులభంగా, వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్
- మహిళలు మితిమీరి వ్యాయామం చేస్తే సంతానోత్పత్తి సమస్యలు తప్పవా?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల 'డిటెక్టివ్ కథ’
- కుంభమేళాను మీడియా ఎలా చూపిస్తోంది... తబ్లీగీ జమాత్ విషయంలో ఏం చేసింది?
- అఫ్గానిస్తాన్లో 20 ఏళ్లుగా ఉన్న అమెరికా-బ్రిటన్ సేనలు ఏం సాధించాయి?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- టైటానిక్: ఆనాటి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఆరుగురు చైనీయులు ఏమయ్యారు... జాతి వివక్ష వారిని వెంటాడిందా?
- జీవితాంతం గుర్తుండిపోవాల్సిన పెళ్లి పెను విషాదాన్ని మిగిల్చింది
- తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న సిలికాన్ వాలీ సీఈఓ కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)