23 రేప్ లు చేసిన 29 మంది పోలీసులు
లక్నో: ఉత్తరప్రదేశ్ లో కొందరు పోలీసులు కీచకులైనారు. మహిళలకు రక్షణ కల్పించకుండ వారి మీద అత్యాచారాలు చేసి కొందరు జైలు పాలైనారు. అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పోలీసులు రేప్ చెయ్యడం ఏమిటి అనుకుంటే అది పోరపాటే.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ సమావేశాలలో స్వయంగా ఈ విషయం అంగీకరించి లిఖితపూర్వకంగా వివరాలు వెల్లడించారు. బీజేపీ శాసన సభ్యుడు శ్యామ్ దేవ్ రాయ్ చౌదరి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ఉత్తరప్రదేశ్ లో గత 14 నెలలలో నమోదు అయిన 23 రేప్ కేసులలో 29 మంది పోలీసులు నిందితులుగా ఉన్నారని చెప్పారు. పలు అత్యాచారాలు పోలీస్ స్టేషన్ లలో జరగడం దారుణం అన్నారు. ఇప్పటి వరకు 11 మంది పోలీసులను అరెస్టు చేశామని చెప్పారు.
విచారణ పూర్తి అయిన తరువాత 8 మంది పోలీసుల పేర్లు ఎఫ్ఐఆర్ ల నుండి తొలగించామని అన్నారు. మిలిగిన కేసులు విచారణలో ఉన్నాయని అఖిలేష్ యాదవ్ వివరించారు. యుపీలో శాంతిభద్రతలు కాపాడవలసిన పోలీసులు కీచకులుగా మారిపోతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications