పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి నన్ను రేప్ చేశారు: ముంబై మోడల్
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పోలీసు శిబిరంలో ఓ మోడల్ పైన ముగ్గురు పోలీసులు అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు పోలీసులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఈ కేసులో ముగ్గురు పోలీసులు, ఓ మహిళతో సహా మొత్తం ఆరుగురిని పోలీసులు బుధవారం నాడు అరెస్టు చేశారు. మోడల్ వయస్సు 29 ఉంటుంది.
బాధిత మోడల్ ముంబై పోలీసు కమిషనర్కు మంగళవారం నాడు ఓ టెక్స్ట్ సందేశం పంపించింది. తన పైన కొందరు అత్యాచారానికి పాల్పడ్డారని, అందులో ఇద్దరు అసిస్టెంట్ పోలీసు ఇన్స్పెక్టర్లు ఉన్నారని ఆరోపించింది. మరో హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని చెప్పింది.
తనకు సందేశం పంపించడంతో ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియా సదరు మోడల్ను కార్యాలయానికి పిలిపించారు. ఆమె నుండి పూర్తి విషయాలు తెలుసుకున్నారు. అనంతరం అరెస్టుకు ఆదేశాలు జారీ చేశారు. అత్యాచారం, లైంగిక వేధింపులు తదితర సెక్షన్ల కింద నిందితుల పైన కేసు నమోదు చేశారు.
ఏప్రిల్ 4వ తేదీన బాధిత మోడల్ ఓ కార్యక్రమం కోసం ఫైవ్ స్టార్ హోటల్కు వెళ్లింది. ఆమె తిరిగి బయటకు వచ్చే సమయంలో పోలీసులు ఆమెను ఆపారు. బలవంతంగా ఆమెను తమ వాహనలోకి ఎక్కించుకున్నారు.
పోలీసు చౌకికి తీసుకు వెళ్లి, అక్కడ అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా, నిన్న వదిలేయాలంటే రూ.4.5 లక్షలు ఇవ్వాలని మోడల్ను డిమాండ్ చేశారు. మోడల్ స్నేహితుడు వచ్చి ఆ డబ్బును అందచేశాడు. తాము ఆ అర్ధరాత్రి సమయంలో పలు ఏటీఎం కేంద్రాలకు వెళ్లి డబ్బులు ఇచ్చామని ఆరోపించారు.